Advertisement

Advertisement


Home > Politics - Political News

ఈ రథాన్ని సాయితేజ్ నడపగలడా..!

ఈ రథాన్ని సాయితేజ్ నడపగలడా..!

దేవకట్టా దర్శకత్వంలో సాయితేజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి రిపబ్లిక్ అనే టైటిల్ ఫిక్స్ చేసిన విషయాన్ని గ్రేట్ ఆంధ్ర గతంలోనే వెల్లడించింది. ఇప్పుడు అదే టైటిల్ తో మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు.

సినిమా థీమ్ చెప్పడం కోసం మోషన్ పోస్టర్ లో మూడు గుర్రాలు, ఓ రథాన్ని యానిమేషన్ చేశారు. ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులకు ప్రతీకగా ఓ గుర్రాన్ని చూపించారు. 

శాసనాల్ని అమలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు సింబాలిక్ గా మరో గుర్రాన్ని, న్యాయాన్ని కాపాడే కోర్టుల్ని ఇంకో గుర్రంగా చూపించారు. ఈ మూడు గుర్రాలు క్రమబద్ధంగా సాగినప్పుడే అది ప్రజాస్వామ్యం-ప్రభుత్వం అవుతుందని, అదే అసలైన రిపబ్లిక్ అంటూ ఫైనల్ గా ఓ రథాన్ని చూపించారు.

మోషన్ పోస్టర్ వరకు బాగానే ఉంది కానీ, రిపబ్లిక్ అనే ఈ రథాన్ని సాయితేజ్ నడపగలడా అనే సందేహం ఇప్పుడు కొత్తగా మొదలైంది. ఎందుకంటే, సాయితేజ్ ఇంత సీరియస్ సబ్జెక్ట్ ఎప్పుడూ చేయలేదు. గతంలో నక్షత్రం లాంటి సీరియస్ సబ్జెక్ట్ చేస్తే అది కాస్తా గట్టి షాక్ ఇచ్చింది.

ఆ షాక్ తర్వాత అన్నీ ఓ మోస్తరు ఎంటర్ టైనర్లే చేశాడు. మళ్లీ ఇన్నాళ్లకు రిపబ్లిక్ అంటూ ఓ పెద్ద రథాన్ని చూపించాడు సాయితేజ్. ప్రతి రోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్ అనే సరదా సినిమాలతో బండి లాగించిన ఈ మెగా హీరో, ఈసారి రిపబ్లిక్ అనే పెద్ద రథాన్ని ఎలా లాగుతాడో చూడాలి.

ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను జేబీ ఎంటర్ టైన్ మెంట్స్, జీ స్టుడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?