Advertisement

Advertisement


Home > Politics - Political News

నువ్వు ఎప్ప‌టికీ ఛీప్‌ ఆర్టిస్ట్‌వే...

నువ్వు ఎప్ప‌టికీ ఛీప్‌ ఆర్టిస్ట్‌వే...

న‌టి తాప్సీపై బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ మ‌రోసారి నోరు పారేసుకున్నారు. నువ్వు ఎప్పిటికీ చిల్ల‌ర ఆర్టిస్ట్‌వే అని అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్యలు చేశారామె. గ‌తంలో బి గ్రేడ్ ఆర్టిస్ట్ అంటూ తాప్సీపై కంగ‌నా ప‌రుష ప‌ద‌జాలాన్ని వాడిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల త‌న ఇంట్లో ఐటీ దాడుల గురించి తాప్సీ తాజాగా ట్వీట్ చేశారు.

గడిచిన మూడు రోజులుగా తన నివాసంలో ఏం జరిగిందో చెప్పారు. పారిస్‌లో తనకు ఒక బంగ్లా ఉందంటూ దాని తాళాల కోసం వెతికారని, కానీ తనకు అక్కడ ఇల్లు లేదని తాప్సీ చెప్పారు. రూ. ఐదు కోట్లు తీసుకున్నానని ఆరోపిస్తూ దాని రశీదులు కోసం వెతికారని, కానీ తానెప్పుడూ అంత పెద్ద మొత్తంలో డ‌బ్బు తీసుకోలేద‌ని చెప్పుకొచ్చారు.  

తాప్సీ ట్వీట్ నేప‌థ్యంలో కంగ‌నా ఎదురు దాడికి దిగారు.  తాప్సీ ఎలాంటి తప్పు చేయపోతే కోర్టు ద్వారా నిర్దోషిగా బయటకు రావాలంటూ సవాల్‌ విసిరారు.

‘నువ్వు ఎప్పటీకి చిల్ల‌ర (ఛీప్‌) ఆర్టిస్ట్‌వే.. ఎందుకంటే నువ్వు రేపిస్టుల ఫెమినిస్ట్‌వి. పన్నులు ఎగ్గొట్టిన మీ రింగ్ మాస్టర్ కశ్యప్‌పై 2013లో కూడా దాడులు జరిగాయి. ప్రభుత్వ నివేదిక బయటికి వచ్చింది. నువ్వు నిర్దోషివైతే కోర్టులో నిరూపించుకో’ అని  కంగనా ట్వీట్‌ చేశారు.  కంగ‌నా ట్వీట్‌పై తాప్సీ ఎలా స్పందిస్తుందోన‌నే ఉత్కంఠ చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో నెల‌కుంది.

లోకేశ్ ప్ర‌తిమాట ఆణిముత్య‌మే

హైకోర్టుకు నిమ్మ‌గ‌డ్డ సారీ

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?