వైఎస్ జగన్ ముప్పయ్యేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటాను అంటున్నారు. ఆయన మళ్లీ గెలవడానికే ఏపీలో ఎన్నో రకాలైన కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అటువంటి జగన్ కి గెలుపునకు ఇదే అతి దగ్గర దారి అంటూ పరిపూర్ణాంద స్వామీజీ ఒక సలహా ఇచ్చారు.
తమిళనాడులో ఆనాడు జయలలిత ప్రవేశపెట్టినట్లుగా యాంటీ కన్వర్షన్ బిల్లుని జగన్ కనుక ఏపీలో చట్టంగా తెస్తే ఆయనే మళ్లీ సీఎం అంటున్నారు పరిపూర్ణానంద స్వామీజీ. జగన్ వెంటనే హిందూ సమాజం మొత్తం ఉంటుందని కూడా ఆయన చెబుతున్నారు.
జగన్ చాలా మంది స్వామీజీలను కలుస్తున్నారని అయితే హిందువులకు దగ్గరయ్యే మార్గం మాత్రం ఈ బిల్లులోనే ఉందని అంటున్నారు పరిపూర్ణానంద స్వామీజీ.
మొత్తానికి స్వామీజీ జగన్ విధానాలను ఒక వైపు విమర్శిస్తూనే ఆయన మళ్లీ అధికారంలోకి రావడానికి రూట్లు చెబుతూండడమే ఇక్కడ విశేషం.
విశాఖ పర్యటనలో స్వామీజీ ఈ రకంగా సంచలన కామెంట్స్ చేశారు. ఇంతకు ముందు బీజేపీ తరఫున ప్రచారం చేసిన స్వామీజీ ఇపుడు మాత్రం ఆ రాజకీయాల వైపు వెళ్ళకపోవడం గమనార్హం.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు