
ఎన్ని కమర్షియల్ చిత్రాలు చేసి, ఎన్ని కోట్ల రూపాయిలు సంపాయించినా ఓ మంచి చిత్రానికి వచ్చే ప్రశంసలు గుండె ని తడిచేస్తాయనేది అక్షర సత్యం. అప్పుడు మనసు ఎంత హాయిగా వుంటుందో మాటల్లో వర్ణించలేము. ఇప్పడు కర్తవ్యం లాంటి అద్బుతమైన చిత్రాన్ని తెలుగు కి తీసుకువచ్చిన ప్రముఖ నిర్మాత శరత్ మరార్ ఫీలింగ్ అంతకుమించే వుందని చెప్పాలి. నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పవర్స్టార్ పవన్కళ్యాణ్ గారితో గోపాలా గోపాల, సర్దార్ గబ్బర్సింగ్, కాటమ రాయుడు లాంటి కమర్షియల్ సినిమాలు నిర్మించారు. అలాగే తమిళ ప్రేక్షకుల్ని ఊర్రూతలూగించిన విజయ్ నటించిన మెర్సల్ చిత్రాన్ని తెలుగులో అదిరింది అనే టైటిల్ తో విడుదల చేశారు.
లేటెస్ట్ గా ఓ ఆఫ్ బీట్ చిత్రం కర్తవ్యం. ఈ చిత్రాన్ని ఈ నెల 16న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు నిర్మాత శరత్ మరార్. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు చిత్రాన్ని, దర్శకుడ్ని, కథానాయిక నయనతార ని ఏ రేంజి లో ప్రశంసిస్తున్నారు. ఇలాంటి ఓ అద్భుతమైన చిత్రాన్ని ఎంతో ధైర్యంతో తెలుగు కి తీసుకువచ్చిన నిర్మాత శరత్ మరార్ కు అభిందనల ప్రశంసలు అందిస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ.. మా నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చాలా మంచి కమర్షియల్ చిత్రాలు చేశాము. కానీ కర్తవ్యం సినిమా వేరు. ఈ సినిమాకు అటు సోషల్ మీడియాలో , ఇటు మీడియా లో మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి మంచి చిత్రాన్ని నేను మెదటి సారి చూసినప్పుడు నా మనసు చలించిపోయింది. దర్శకుడి ప్రతిభ , నయనతార మరియు ఇతర నటీనటుల నటన నన్ను కట్టిపాడేశాయి. జిబ్రాన్ మ్యూజిక్ నన్ను భావోద్వేగంలో ముంచేసింది. ఈ సినిమా అయిపోయాక ఆల్మెస్ట్ ఒక్క రోజంతా నన్ను వెంటాడింది. అసలు గ్రామాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఇంత అవస్థ పడాలా.. అనే ప్రశ్న నాలో నేను వేసుకున్నాను. అన్ని చిత్రాలు డబ్బుల కోసం కాదు మనుషుల కొసం కొన్ని చిత్రాలు వుంటాయి అని గట్టిగా నమ్మి ఈ చిత్రాన్ని మా బ్యానర్ నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పేరుమీద తెలుగు ప్రేక్షకులకి చూపించాలని అనుకున్నాను. ఈ ప్రయత్నానికి ప్రత్యేకంగా మీడియా ఫ్రెండ్స్ బాగా సపోర్ట్ చేశారు. ఈ కర్తవ్యం అనే చిత్రం నా బ్యానర్ వాల్యూ ని రెట్టింపు చేసిందని, ఇలాంటి మంచి చిత్రాలు తెలుగు ప్రేక్షకుడి కి చూపించటానికి ఎప్పుడు నేను, నా బ్యానర్ నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సిద్దంగా వుంటుందని తన ఆనందాన్ని తెలిపారు..