అలా అయితే బిగ్ బాస్ బౌట్ లోకి వస్తానన్న రాధేమా..!

బిగ్ బాస్ -9 కి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ స్కాండల్ హౌస్ కు సెలబ్రిటీల ఎంపిక జరుగుతోంది. వివాదాస్ప సెలబ్రిటీల కోసం జల్లెడపడుతోంది బిగ్ బాస్ యూనిట్. బిగ్ బాస్ ఎనిమిది ముగిసినప్పటి…

బిగ్ బాస్ -9 కి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ స్కాండల్ హౌస్ కు సెలబ్రిటీల ఎంపిక జరుగుతోంది. వివాదాస్ప సెలబ్రిటీల కోసం జల్లెడపడుతోంది బిగ్ బాస్ యూనిట్. బిగ్ బాస్ ఎనిమిది ముగిసినప్పటి నుంచి వెలుగులోకి వచ్చిన అలాంటి వివాదాస్పద వ్యక్తులను వెదుకుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో వాళ్ల పరిశీలనలోకి వివాదాస్పద మాతాజీ రాధేమా పేరు కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ స్కాండల్ హౌస్ ప్రోగ్రామ నిర్వహకులు ఆమెను సంప్రదించారు. అయితే ఒక షరతు విధిస్తూ బిగ్ బాస్ లో పాల్గొనడానికి ఒప్పుకొంది రాధేమా. 

అయితే ఆ షరతును బిగ్ బాస్ వాళ్లు యాక్సెప్ట్ చేయలేకపోయారు. దీంతో ఆమె బిగ్ బాస్ లో పాల్గొనడం జరగని పని స్పష్టం అవుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే… అమ్మవారు రోజుకు రెండు గంటల సేపు తనకు విరామం ఇవ్వాలని అడిగారట. బిగ్ బాస్ హౌస్ నుంచి తను రోజుకు రెండు గంటల సేపు బయటకు వస్తానని.. ఆ తర్వాత మళ్లీ షో సభ్యులతో కలిసిపోతానని అమ్మవారు అడిగారట. అయితే.. అయితే షో నియమనిబంధనలకు అది విరుద్ధం!

అసలు షోలో పాల్గొంటున్న సెలబ్రిటీలకు తాము ఎక్కడున్నది కూడా తెలియదు. క్యాలెండర్లు , వాల్ క్లాకులు కూడా అందుబాటులో ఉండవు. మరి ఈ నయా అమ్మవారి కోసం రూల్స్ ను మార్చలేరు కదా.. అందుకే రాధేమా బిగ్ బాస్ లో పాల్గొనడం సాధ్యం అయ్యేలా లేదు. మరి బిగ్ బాస్ మీద ఆసక్తిని కలిగి ఉన్నప్పటికీ.. రాధేమా ఆ రెండు గంటల గడువు ఎందుకు అడిగందంటే.. ఆ సమయంలో తన భక్తులకు దర్శనం ఇవ్వడానికి అట! ఆ టూ అవర్స్ టైమిస్తే.. తను వారికి దర్శనమిచ్చి.. తనదైన శైలిలో వారిని కరుణించి వచ్చేస్తానని రాధేమా అన్నారు. కానీ షో నిర్వాహకులు సారీ చెప్పేశారు! చూశారా.. అమ్మవారు తన భక్తుల కోసం బిగ్ బాస్ నే త్యాగం చేశారు.