చరణ్‌ బడ్జెట్‌ పెరిగిపోతోంది

రామ్‌ చరణ్‌తో శ్రీను వైట్ల తెరకెక్కించబోతున్న చిత్రానికి అంతా పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యేలా చూసుకుంటున్నారు. దేవిశ్రీప్రసాద్‌, తమన్‌లని తిప్పి తిప్పి మారుస్తున్న అగ్ర హీరోలు వేరే మ్యూజిక్‌ డైరెక్టర్స్‌తో రిస్క్‌ చేయడం లేదు. కానీ…

రామ్‌ చరణ్‌తో శ్రీను వైట్ల తెరకెక్కించబోతున్న చిత్రానికి అంతా పర్‌ఫెక్ట్‌గా సెట్‌ అయ్యేలా చూసుకుంటున్నారు. దేవిశ్రీప్రసాద్‌, తమన్‌లని తిప్పి తిప్పి మారుస్తున్న అగ్ర హీరోలు వేరే మ్యూజిక్‌ డైరెక్టర్స్‌తో రిస్క్‌ చేయడం లేదు. కానీ చరణ్‌ ‘గోవిందుడు అందరివాడేలే’కి యువన్‌శంకర్‌రాజాతో చేసాడు, దీనికి తమిళ యవ తరంగం అనిరుధ్‌ని తీసుకొచ్చాడు. 

తమిళంలో విజయ్‌, అజిత్‌లాంటి స్టార్‌ హీరోలు అనిరుధ్‌ వెంట పడుతున్నారు. ఏ.ఆర్‌. రెహమాన్‌, హారిస్‌ జైరాజ్‌ జమానా అయిపోవడంతో ఇప్పుడు అనిరుధ్‌ అక్కడ హాట్‌ ఫేవరెట్‌ అయ్యాడు. అతడిని టాలీవుడ్‌కి తీసుకు రావడమంటే భారీగా చెల్లించుకోక తప్పదు. కేవలం అనిరుధ్‌కే రెండున్నర కోట్లు చెల్లించారని టాక్‌. 

అంతే కాదు.. ఆల్రెడీ శ్రీను వైట్ల, అతని రైటర్స్‌ టీమ్‌కి సబ్జెక్ట్‌ నిమిత్తం చెల్లించినా కానీ కోన వెంకట్‌, గోపీమోహన్‌ ఇద్దరికీ చెరో కోటి ఇచ్చి సైన్‌ చేయించారట. ఈ సినిమా బడ్జెట్‌ మొదట అనుకున్నది నలభై అయిదు కోట్లు కాగా, ఇప్పటికే ఎస్టిమేట్‌ యాభై దాటేసిందట. ఇక షూటింగ్‌లో ఏమైనా వేస్టేజ్‌ జరిగి.. ఖర్చు ఎక్సెస్‌ అయిందంటే ఓవర్‌ బడ్జెట్‌ అయిపోవడం గ్యారెంటీ. అంటే నిర్మాత రికవర్‌ అవ్వాలన్నా కూడా సినిమా పెద్ద హిట్‌ అయి తీరాలన్నమాట.