ఆ ముగ్గురికీ ఈ రిస్క్ అవసరమా?

టైమ్ అంతగా బాగులేనపుడు మరింత జాగ్రత్తగా వుండాలి. అలిసి పోయినపుడు కొత్తదారి వెదక కూడదు..అలవాటైన బండి బాటలో వెళ్లిపోవాలి. కానీ టాలీవుడ్ కు చెందిన ముగ్గరు కలిసి ఇందుకు డిఫరెంట్ గా ప్రవర్తిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు.…

టైమ్ అంతగా బాగులేనపుడు మరింత జాగ్రత్తగా వుండాలి. అలిసి పోయినపుడు కొత్తదారి వెదక కూడదు..అలవాటైన బండి బాటలో వెళ్లిపోవాలి. కానీ టాలీవుడ్ కు చెందిన ముగ్గరు కలిసి ఇందుకు డిఫరెంట్ గా ప్రవర్తిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. వారే నిర్మాత భోగవిల్లి ప్రసాద్, దర్శకుడు సుకుమార్, హీరో ఎన్టీఆర్ కలిసి ఓ సినిమా చేస్తున్నారు.

బోగవిల్లి ప్రసాద్ నిర్మాతగా ఏమంత హ్యాపీగా లేరన్నది వాస్తవం. అలాగే సుకుమార్ ఇప్పటికే మహేష్ తో ఓ ప్రయోగం చేసి దారుణంగా దెబ్బతిన్నారు. ఇక ఎన్టీఆర్ ఎదో గుడ్డిలో మెల్ల అన్నట్లుగా టెంపర్ సినిమాతో తన మార్కెట్ అలా అలా నిలబెట్టుకున్నారు. ఇలాంటపుడు ముగ్గురు కలిసి మరో ప్రయోగం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

యూరప్ తదితర దేశాల్లో దాదాపు సినిమా మొత్తం షూట్ చేస్తూ, భారీ వ్యయం తలకెత్తుకున్నారు నిర్మాత ప్రసాద్. డిఫరెంట్ గెటప్ అంటూ మళ్లీ ఏదో ప్రయోగమే చేస్తున్నట్లు కనిపిస్తోంది దర్శకుడు సుకుమార్. అసలే కెరీర్ అంతంతమాత్రంగా వున్నపుడు ఇలాంటి సినిమాకు ఓకె అని చెప్పి ఎన్టీఆర్ మరింత రిస్క్ చేస్తున్నట్లుంది. మరి సినిమా లో ఏముందో ఆ ముగ్గరికే తెలియాలి..వారిని అంత రిస్క్ దిశగా నడిపిస్తోందనేది?.