పట్టపగలు తల్లిదండ్రుల్ని నరికి చంపేశాడు

ఉదయం 11 గంటలు.. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు.. సరిగ్గా అప్పుడే వచ్చాడు లక్ష్మణరావు. తేడాగా కనిపిస్తున్న కొడుకు వైపు ఆ తల్లిదండ్రులు వింతగా చూశారు. వాళ్ల అనుమానమే నిజమైంది. లక్ష్మణరావు కత్తి…

ఉదయం 11 గంటలు.. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు.. సరిగ్గా అప్పుడే వచ్చాడు లక్ష్మణరావు. తేడాగా కనిపిస్తున్న కొడుకు వైపు ఆ తల్లిదండ్రులు వింతగా చూశారు. వాళ్ల అనుమానమే నిజమైంది. లక్ష్మణరావు కత్తి తీశాడు. విచక్షణారహితంగా దాడి చేశాడు. తల్లిదండ్రుల్ని పొట్టన పెట్టుకున్నాడు.

విజయనగరం జిల్లా బొండపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. పట్టపగలు హత్య జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

మృతుడు రాము వయసు 55 సంవత్సరాలు. మొదటి భార్య ద్వారా రాము, లక్ష్మణరావు జన్మించారు. రాము వైజాగ్ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. 27 ఏళ్ల లక్ష్మణరావు కూలి పని చేసుకుంటూ వేరే ఇంట్లో ఉంటున్నాడు.

మొదటి భార్య చనిపోయిన వెంటనే రాము రెండో పెళ్లి చేసుకున్నాడు. జయలక్ష్మిని పెళ్లాడాడు. వాళ్లకు ఓ పాప కూడా పుట్టింది. హత్య జరిగిన సమయంలో పాప ఇంట్లో లేదు, స్కూల్ కు వెళ్లింది.

కొన్నాళ్లుగా చిన్న కొడుకు లక్ష్మణరావుతో, రాముకు గొడవలు జరుగుతున్నాయి. అయితే అవి ఇలా హత్యకు దారి తీస్తాయని ఎవ్వరూ ఊహించలేకపోయారు.

జరిగిన హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏ కారణాల వల్ల లక్ష్మణరావు ఈ హత్యలకు పాల్పడ్డాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.