బాబు పాల‌న.. ఇలా ఉండ‌బోతోందంటున్న జ‌గ‌న్‌!

తాడేప‌ల్లిలో ప్ర‌భుత్వ స్థ‌లాన్ని ఆక్ర‌మించి వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని నిర్మించార‌న్న కార‌ణంతో బాబు స‌ర్కార్ కూల్చివేసింది. ఈ ఘ‌ట‌న‌పై వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎక్స్ వేదిక‌గా ఘాటుగా స్పందించారు. చంద్ర‌బాబు…

తాడేప‌ల్లిలో ప్ర‌భుత్వ స్థ‌లాన్ని ఆక్ర‌మించి వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని నిర్మించార‌న్న కార‌ణంతో బాబు స‌ర్కార్ కూల్చివేసింది. ఈ ఘ‌ట‌న‌పై వైసీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఎక్స్ వేదిక‌గా ఘాటుగా స్పందించారు. చంద్ర‌బాబు ఐదేళ్ల పాల‌న ఎలా ఉండ‌బోతోందో ఆయ‌న ఆ పోస్టులో పేర్కొన్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని జ‌గ‌న్ తెలిపారు. జ‌గ‌న్ ఎక్స్‌లో పెట్టిన‌ పోస్టు ఏంటంటే…

“ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను స్థాయికి తీసుకెళ్లారు.  ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయి. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ ఐదేళ్లపాటు పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదు. ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజలతోడుగా గట్టిపోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నాను” అని ఆయ‌న తెలిపారు.

ఎన్నిక‌ల త‌ర్వాత హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌తో చంద్ర‌బాబు ర‌క్తాన్ని పారిస్తున్నార‌ని జ‌గ‌న్ ఘాటు విమ‌ర్శ చేశారు. ఈ ఘ‌ట‌న ద్వారా బాబు ఐదేళ్ల పాల‌న ఎలా ఉండ‌బోతుందో అర్థ‌మ‌వుతుంద‌ని జ‌గ‌న్ వెల్ల‌డించారు. అయితే త‌మ పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కొంటాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. వైసీపీ కేంద్ర కార్యాల‌య కూల్చివేతను ఆ పార్టీ ఎంత సీరియ‌స్‌గా ఉందో జ‌గ‌న్ ఎక్స్‌లో పెట్టిన పోస్టే తెలియ‌జేస్తోంది.