ప్రమాణ స్వీకారం ముగిసింది.. ఎన్టీఆర్ దిగాడు

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందుకున్నారు. చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. Advertisement రజనీకాంత్, రామ్ చరణ్, నిఖిల్,…

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అతిథిగా ఆహ్వానం అందుకున్నారు. చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

రజనీకాంత్, రామ్ చరణ్, నిఖిల్, నారా రోహిత్.. ఇలా కొంతమంది సెలబ్రిటీలు ప్రమాణ స్వీకారోత్సవంలో కనిపించారు. మరి ఎన్టీఆర్ సంగతేంటి? కార్యక్రమంలో ఎన్టీఆర్ కనిపించలేదు.

అసలు ఎన్టీఆర్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారా లేదా అనే చర్చ జోరుగా నడిచిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ను పిలవలేదని కొందరు, పిలిచినా ఎన్టీఆర్ హాజరుకావట్లేదని మరికొందరు చెప్పుకున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించలేదని తెలుస్తోంది. నారా లోకేష్, బాలకృష్ణ ఈ విషయంలో ససేమిరా అన్నట్టు సమాచారం.

ఓవైపు ఇలా ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిందో లేదో అలా ఎన్టీఆర్ హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. గోవాలో దేవర షూటింగ్ లో పాల్గొన్న తారక్, ఈరోజు హైదరాబాద్ కు చేరుకున్నాడు. నిజంగా అతడికి ఆహ్వానం అంది ఉంటే, ఈరోజు పొద్దున్నే నేరుగా విజయవాడలో అతడు దిగి ఉండేవాడని.. ఎలాంటి ఇన్విటేషన్ అందలేదు కాబట్టే హైదరాబాద్ లో దిగి ఇంటికెళ్లిపోయాడని అంటున్నారు చాలామంది.

నిజానికి ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ హాజరుకాకపోవడమే మంచిదైంది. ఎందుకంటే, వేదికపై మొత్తం మెగా సందడి కనిపించింది. ప్రధాని పాల్గొన్న కార్యక్రమం కాబట్టి, ప్రోటోకాల్ ప్రకారం చూసుకుంటే, ఎన్టీఆర్ ను వేదికపైకి పిలిచే అవకాశం లేదు. నారా రోహిత్, నిఖిల్ తో పాటు ఎన్టీఆర్ గ్యాలరీలో కూర్చోవాల్సి వచ్చేది. ఆ సన్నివేశాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అస్సలు జీర్ణించుకోలేరు.