అప్పుడెప్పుడో పెళ్లి.. తాజాగా హనీమూన్

ఇలా పెళ్లవ్వడం ఆలస్యం, అలా హనీమూన్ కు వెళ్తుంటాయి జంటలు. కానీ సెలబ్రిటీలు అలా కాదు, అప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్లు హనీమూన్ కూడా ఎంజాయ్…

ఇలా పెళ్లవ్వడం ఆలస్యం, అలా హనీమూన్ కు వెళ్తుంటాయి జంటలు. కానీ సెలబ్రిటీలు అలా కాదు, అప్పటికే కమిట్ అయిన సినిమాలు పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్లు హనీమూన్ కూడా ఎంజాయ్ చేయరు. రకుల్ కు కూడా ఈ సమస్య ఉంది. 

ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీకి అప్పట్నుంచి టైమ్ దొరకలేదు. ఎట్టకేలకు రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ ఫ్రీ అయ్యారు. పెళ్లయిన 4 నెలల తర్వాత ఇద్దరూ కలిసి హనీమూన్ కు వెళ్లారు. 

రకుల్- జాకీ కొకొమో ఐలాండ్స్ కు వెళ్లారు. ఫిజీ లోని ఓ ప్రైవేట్ ఐల్యాండ్ ఇది. ఈ చిన్న ద్వీపంలో ప్రస్తుతం ఈ భార్యాభర్తలిద్దరూ ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు, తన భార్య రకుల్ కోసం జాకీ ఫొటోగ్రాఫర్ గా కూడా మారాడు. ఈ విషయాలన్నింటినీ రకుల్ తన సోషల్ మీడియా పేజీలో వెల్లడించింది.

దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకున్నారు రకుల్ ప్రీత్, జాకీ భగ్నానీ. కరోనా టైమ్ లో తమ రిలేషన్ షిప్ ను బయటపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గోవాలో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి తర్వాత వెంటనే హనీమూన్ కు వెళ్లడానికి వీళ్లకు టైమ్ దొరకలేదు. రకుల్ అప్పటికే 2 సినిమాలు చేస్తోంది. అటు జాకీ కూడా నిర్మాతగా ఓ సినిమా చేస్తున్నాడు.

ఇన్నాళ్లకు ఆ కమిట్ మెంట్స్ అన్నింటినీ పూర్తిచేసి హనీమూన్ కు వెళ్లింది ఈ జంట. హనీమూను పూర్తిచేసుకొని ఇండియాకొచ్చిన వెంటనే భారతీయుడు-2 ప్రమోషన్స్ లో పాల్గొంటుంది రకుల్.

Click Here More Photos