నిందితుడిని చిత‌క్కొట్టిన బాధితులు

ఆరేళ్ల బాలిక‌ను కిడ్నాప్ చేసిన నిందితుడిని బాధితులు పోలీస్‌స్టేష‌న్‌లో చిత‌క్కొట్టారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని అబిడ్స్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. దీంతో పోలీస్‌స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కుంది. Advertisement అబిడ్స్‌లోని క‌ట్టెల‌మండిలో…

ఆరేళ్ల బాలిక‌ను కిడ్నాప్ చేసిన నిందితుడిని బాధితులు పోలీస్‌స్టేష‌న్‌లో చిత‌క్కొట్టారు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్‌లోని అబిడ్స్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. దీంతో పోలీస్‌స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కుంది.

అబిడ్స్‌లోని క‌ట్టెల‌మండిలో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలిక ప్ర‌గ‌తికి చాక్లెట్ ఇచ్చి ఎండీ బిలాల్ అనే వ్య‌క్తి శ‌నివారం సాయంత్రం ఆటోలో కిడ్నాప్ చేశాడు. దీంతో త‌ల్లిదండ్రుల‌తో పాటు బంధువుల్లో ఆందోళ‌న నెల‌కుంది. బాలిక కిడ్నాప్ విష‌య‌మై పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలిక కిడ్నాప్‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు.

ఐదు బృందాల‌తో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఎట్ట‌కేల‌కు కిడ్నాప్‌ను ఛేదించారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని ఇనుములనర్వ‌లో కిడ్నాపర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక‌ను సుర‌క్షితంగా పోలీస్‌స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

అప్ప‌టికే అబిడ్స్ పోలీస్‌స్టేష‌న్‌కు చేరుకున్న బాలిక త‌ల్లిదండ్రులు, బంధువులు నిందితుడిని పోలీస్‌స్టేష‌న్‌లోనే చిత‌క్కొట్టారు. పోలీసుల‌కు అదుపు చేయ‌డం క‌ష్ట‌మైంది. దీంతో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కున్నాయి. నిందితుడిని పోలీస్‌స్టేష‌న్‌లోకి త‌ర‌లించ‌డం పోలీసులకు క‌ష్ట‌సాధ్య‌మైంది. కిడ్నాప‌ర్‌ను క‌ఠినంగా శిక్షించాల‌నే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి.

4 Replies to “నిందితుడిని చిత‌క్కొట్టిన బాధితులు”

Comments are closed.