క‌డ‌ప‌లో వైసీపీని యాక్టీవ్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే

క‌డ‌ప‌లో వైసీపీని యాక్టీవ్ చేసిన ఘ‌న‌త టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.మాధ‌వీరెడ్డికి ద‌క్కుతుంది. అధికారాన్ని కోల్పోయిన వైసీపీ నేత‌లు … ఎందుకొచ్చిన గొడ‌వ‌ల్లే అని రాష్ట్ర వ్యాప్తంగా మౌనంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇందుకు వైఎస్…

క‌డ‌ప‌లో వైసీపీని యాక్టీవ్ చేసిన ఘ‌న‌త టీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.మాధ‌వీరెడ్డికి ద‌క్కుతుంది. అధికారాన్ని కోల్పోయిన వైసీపీ నేత‌లు … ఎందుకొచ్చిన గొడ‌వ‌ల్లే అని రాష్ట్ర వ్యాప్తంగా మౌనంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇందుకు వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప కూడా మిన‌హాయింపు కాదు. వైసీపీ నేత‌లు ఎవ‌రి ప‌నుల్లో వాళ్లు నిమ‌గ్న‌మై ఉన్నారు. చివ‌రికి దాడుల‌కు గురి అవుతున్నా, అధికారం లేద‌నే భ‌యంతో బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్న ద‌య‌నీయ స్థితి.

ఈ నేప‌థ్యంలో వైఎస్సార్ జిల్లా కేంద్ర‌మైన క‌డ‌ప‌లో జిల్లాలోని వైసీపీ నేత‌లంతా రోడ్డెక్కి ప్ర‌శ్నించ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. వీళ్లంద‌రినీ క‌లిపిన ఘ‌న‌త క‌డ‌ప ఎమ్మెల్యే మాధ‌వీరెడ్డికి ద‌క్కుతుంది. క‌డ‌ప మేయ‌ర్ సురేష్‌బాబు ఇంటిపై చెత్త‌ను క‌డ‌ప ఎమ్మెల్యే మాధ‌వీరెడ్డి వేయించారు. గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి ఘ‌ట‌న‌లు లేవు. రాజ‌కీయంగా ప‌ర‌స్ప‌రం విమ‌ర్శించుకోడానికే ప‌రిమితం అయ్యేవారు.

కానీ మాధ‌వీరెడ్డి కాస్త దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ప్ర‌త్య‌ర్థుల్ని, సొంత వాళ్ల‌ను కూడా వీపులు విమానం మోత మోగిస్తాన‌ని హెచ్చ‌రించారు. అలాగే క‌డ‌ప మేయ‌ర్, అలాగే వైసీపీ కార్పొరేట‌ర్ల ఇళ్ల ముందు చెత్త వేయిస్తాన‌ని హెచ్చ‌రించి, మ‌రీ అన్నంత ప‌ని చేయించారు. దీంతో వైసీపీ అవ‌మానంగా భావించి, నాయ‌కులంతా రోడ్ల మీద‌కి వ‌చ్చారు.

క‌డ‌ప మేయ‌ర్ సురేష్‌బాబుకు మ‌ద్ద‌తుగా వైసీపీ జిల్లా అధ్య‌క్షుడు ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి, అన్న‌మ‌య్య జిల్లా అధ్య‌క్షుడు అమ‌ర్‌నాథ్‌రెడ్డి, బ‌ద్వేలు ఎమ్మెల్యే డాక్ట‌ర్ సుధా, వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా త‌దిత‌రులంతా రోడ్డెక్కారు. టీడీపీ ఎమ్మెల్యే తీరును నిల‌దీశారు. ఇదే సంద‌ర్భంలో క‌డ‌ప ఎమ్మెల్యే తీరును సొంత పార్టీ నేత‌లు త‌ప్పు ప‌డుతున్నారు.

21 Replies to “క‌డ‌ప‌లో వైసీపీని యాక్టీవ్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే”

  1. నిన్న ఖాదంబరి జెత్వాని అనె మొంబై కి చెందిన నటి, జగన్ ప్రబుత్వం లొ YCP నాకయలు, కొందరు IPS లు కలసి తనను ఎంత గా వెందించది స్వయంగా డిబెట్ లొ చెప్పారు. ఈమె, ఈమె కుటుంబ సభ్యుల మీద దొం.-.గ కె.-.సులు పెట్టి 40 రొజుల పాటు జైల్ లొ ఉంచి చిత్రవద చెసారు.

    .

    ఈ ఖాదంబరి జెత్వాని ఒక డాక్టర్ కూడా. ఈమె తాల్లి లొ పని చెసారు, తండ్రి దెశం కొసం అర్మి లొ పని చెసారు.

  2. నిన్న ఖాదంబరి జెత్వాని అనె మొంబై కి చెందిన నటి, జగన్ ప్రబుత్వం లొ Y.-.C.-.P నాకయలు, కొందరు IPS లు కలసి తనను ఎంత గా వెందించది స్వయంగా డిబెట్ లొ చెప్పారు. ఈమె, ఈమె కుటుంబ సభ్యుల మీద దొం.-.గ కె.-.సులు పెట్టి 40 రొజుల పాటు జైల్ లొ ఉంచి చిత్రవద చెసారు.

    .

    ఈ ఖాదంబరి జెత్వాని ఒక డాక్టర్ కూడా. ఈమె తాల్లి లొ పని చెసారు, తండ్రి దెశం కొసం అర్మి లొ పని చెసారు.

  3. నిన్న ఖాదంబరి జెత్వాని అనె మొంబై కి చెందిన నటి, జగన్ ప్రబుత్వం లొ Y.-.C.-.P నాకయలు, కొందరు IPS లు కలసి తనను ఎంత గా వెందించది స్వయంగా TV డిబెట్ లొ చెప్పారు. ఈమె, ఈమె కుటుంబ సభ్యుల మీద దొం.-.గ కె.-.సులు పెట్టి 40 రొజుల పాటు జై.-.ల్ లొ ఉంచి చిత్రవద చెసారు.

    .

    ఈ ఖాదంబరి జెత్వాని ఒక డాక్టర్ కూడా. ఈమె తాల్లి లొ పని చెసారు, తండ్రి దెశం కొసం అర్మి లొ పని చెసారు.

    1. Chudandi..Chandrababu ante ne ranku bhagotaalu tappa chesedem undadu ani andariki telusu..pani pata lekunda lokesh babu honey traps cheyistu vaatillo kanabadina YCP private parts chusi anandistuntaadu..family vishayallo Racha cheyadam…no one is interested in these things now..meeru entha try chesina Mee yellow channels lo raskovalsinde..nikharsaina nijanni bayataki teeyandi..apudu ycp fans kuda alochistaaru..ilanti chillara vishayalu kaadu

Comments are closed.