జనసేనాని పవన్కల్యాణ్పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎప్పట్లాగే చంద్రబాబుకు చీవాట్లు పెట్టారు. జగనన్న అమ్మ ఒడి పథకం నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా కురుపాంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. వారాహియాత్ర నిర్వహిస్తున్న పవన్కల్యాణ్… సీఎం జగన్తో పాటు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఇవాళ పవన్కల్యాణ్పై జగన్ విమర్శల డోస్ పెంచడం గమనార్హం. ఇంత వరకూ చంద్రబాబు దత్త పుత్రుడంటూ ఒకట్రెండు విమర్శలతో సరిపెట్టేవారు. కానీ పవన్ అతిపై జగన్ తనదైన స్టైల్లో మొట్టికాయలు వేశారు. చంద్రబాబు కోసం 15 ఏళ్ల క్రితం దత్తపుత్రుడు బయల్దేరాడని విమర్శించారు. 2014లో చంద్రబాబు, పవన్కల్యాణ్ ఇంటింటికి తమ సంతకాలతో కూడిన మ్యానిఫెస్టోను పంపారని గుర్తు చేశారు.
హామీలను నిలబెట్టుకోని చంద్రబాబును దత్త పుత్రుడు ఏనాడూ ప్రశ్నించలేదన్నారు. చంద్రబాబు మోసాల్ని ఆయన పాలించిన ఐదేళ్లలో ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. దత్త పుత్రుడు మామూలుగా మాట్లాడ్డం లేదన్నారు. ఊగిపోతూ మాట్లాడుతున్నాడని, అలా మనం మాట్లాడలేమన్నారు.
ఆ ప్యాకేజీ స్టార్ వారాహి అనే ఓ లారీ ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చనివారిని చెప్పుతో కొడతానంటాడు, తాట తీస్తానంటాడని చెప్పుకొచ్చారు. ఇలా ఇష్టానుసారం మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దత్తపుత్రుడిలా తొడలు కొట్టలేమన్నారు. పూనకం వచ్చినట్లు ఊగిపోతూ బూతులు తిట్టలేమన్నారు. ఆ మనిషి నోటికి అదుపు లేదన్నారు. అతనికి నిలకడా లేదని మండిపడ్డారు. వారిలా నాలుగేళ్లకు ఒకరిని చొప్పున నలుగురిని పెళ్లి చేసుకుని భార్యను మార్చలేమన్నారు. పెళ్లి అనే పవిత్రమైన దాన్ని రోడ్డున పడేయలేమన్నారు.అవన్నీ వారికి చెందిన పేటెంట్ అని పవన్ను ఓ రేంజ్లో సీఎం జగన్ ఉతికి ఆరేశారు.
వారాహి యాత్రలో తనను రోజుమార్చి రోజు తీవ్రస్థాయిలో తిట్టే పవన్కు జగన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. పవన్ నాలుగు పెళ్లిళ్లను టచ్ చేస్తూ సుతిమెత్తగా ర్యాగింగ్కు దిగారు. అలాగే కొడ్తా, తిడ్తా అని చెలరేగిపోయే పవన్ను రౌడీయిజాన్ని జగన్ బట్టబయలు చేశారు. పవన్ మాటల్లో చెబితే, జగన్ ఆ పని చేతల్లో చూపించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.