డిస్ట్రిబ్యూషన్ లోకి ‘మైత్రీ మూవీస్’

సినిమా రంగంలోకి ఒక్కసారిగా స్పీడ్ గా దూసుకువచ్చింది మైత్రీ మూవీస్. భారీ సినిమాలే టార్గెట్ గాముందుకు వెళ్తోంది. మహేష్ బాబు, బన్నీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాని సినిమాలు వరుసగా ఫిక్స్ అయిపోయి వున్నాయి.…

సినిమా రంగంలోకి ఒక్కసారిగా స్పీడ్ గా దూసుకువచ్చింది మైత్రీ మూవీస్. భారీ సినిమాలే టార్గెట్ గాముందుకు వెళ్తోంది. మహేష్ బాబు, బన్నీ, పవన్ కళ్యాణ్, చిరంజీవి, నాని సినిమాలు వరుసగా ఫిక్స్ అయిపోయి వున్నాయి. ఇవి కాక ప్రభాస్ సినిమా చేయాల్సి వుంది. బాలయ్య సినిమా మొదలు పెట్టాల్సి వుంది. ఇన్ని పెద్ద సినిమాలు, క్రేజీ సినిమాలు చేతిలో ఒక్కసారిగా వున్న బ్యానర్ మరోకటి లేదు టాలీవుడ్ లో.

బహుశా అందుకే కావచ్చు, తమ సినిమాలు నైజాంలో తామే డిస్ట్రిబ్యూట్ చేసుకునే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసు తెరిచారని తెలుస్తోంది. పంపిణీ రంగంలో అపార అనుభవం వున్న అన్నపూర్ణ సాయిబాబా సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం విడుదలకు రెడీగా వున్న ఉప్పెన సినిమాతో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నారని టాక్. వాస్తవానికి ఈ సినిమాను దిల్ రాజుకు ఇచ్చారు. కోటి రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు బోగట్టా. బహుశా వెనక్కు ఇచ్చి, తామే పంపిణీ చేస్తామని చెప్తారని టాక్.

ఇదిలా వుంటే స్వంత డిస్ట్రిబ్యూషన్ కు రావడం వెనుక ఇంట్రస్టింగ్ రీజన్ వుందని తెలుస్తోంది. ఆ మధ్య మత్తు వదలరా అనే చిన్న సినిమా చేసారు. దాన్ని స్వంతంగా నైజాంలో పంపిణీ చేయాల్సి వచ్చింది. అప్పుడు గ్రాస్, నెట్, షేర్, ఖర్చులు వగైరా వ్యవహారాల మీద క్లారిటీ వచ్చిందని, అప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నదానికి అసలు లెక్కలకు తేడా తెలిసిందని, అందుకే తమ సినిమాలు అన్నీ తామే నైజాంలో పంపిణీ చేయాలని అనుకుంటున్నారని టాక్.

చంద్రబాబుకు ఏజెంట్‌లా పనిచేస్తున్న నిమ్మగడ్డ..

చంద్రబాబు వివరణ కోరతారా? లేక ఆ పార్టీపై వేటు వేస్తారా?