ఎట్టకేలకు సుదీర్ఘ కాలం తర్వాత వారాహి యాత్ర ప్రారంభానికి పవన్కల్యాణ్ ముందుకొచ్చారు. వైఎస్ జగన్ను సీఎంగా గద్దె దించడమే ఏకైక లక్ష్యంగా జనసేనాని రాజకీయం చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వైఎస్ జగన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం కానివ్వనని పవన్ శపథం చేశారు. అయినా ప్రజాదరణ ముందు పవన్ శాపాలు గాలికి కొట్టుకుపోయాయి. సీఎం కుర్చీలో జగన్ కూచోవడాన్ని పవన్ జీర్ణించుకోలేకపోతున్నారు.
గత ఏడాది జనసేన వార్సికోత్సవ సభలో పవన్ ఆవేశంగా ప్రసంగిస్తూ… జగన్ను గద్దె దించడానికి రోడ్ మ్యాప్ ఇవ్వాలని మిత్రపక్షమైన బీజేపీని కోరారు. రోడ్ మ్యాప్ ఇచ్చామని బీజేపీ అంటుంటే, ఇవ్వలేదని పవన్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి వీరమరణం పొందలేనని పవన్ తెగేసి చెప్పారు. తన ప్రయాణం టీడీపీతోనే అని స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలనివ్వకూడదనే పట్టుదలతో పవన్ ఉన్నారు.
వారాహి యాత్రకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో ఆయనపై సెటైర్స్ పేలుతున్నాయి. వారాహి వాహనం, డీజిల్ ఖర్చంతా టీడీపీదే అని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారని, మరోవైపు రోడ్ మ్యాప్ తమదే అని బీజేపీ నేతలు అంటున్నారని, ఈ మాత్రం దానికి వారాహి యాత్రం చేయడం దేనికంటూ నెటిజన్లు నిలదీస్తున్నారు.
చంద్రబాబును సీఎం చేయడానికి వారాహి యాత్ర చేయాలా? తనకు అధికారం ఇవ్వాలని ప్రజల్ని కోరే దమ్ము, ధైర్యం లేనప్పుడు… ఎవరిని ఉద్ధరించడానికి ఈ యాత్ర అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పక్క పార్టీ అధ్యక్షుడిని సీఎం చేయడానికి పవన్కల్యాణ్ యాగం చేయడం దేనికో అనే నిలదీతలు ఎదురవుతున్నాయి.