పూజా హెగ్డే స్థానంలో సీతారామం బ్యూటీ

పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా విజయ్ సరసన పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆమె…

పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమాకు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా విజయ్ సరసన పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, ఆమె స్థానాన్ని సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఆక్రమించింది.

సీతారామం సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది మృణాల్. ఆ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ లో తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటోంది ఈ బ్యూటీ. ఇందులో భాగంగా నాని సరసన ఓ సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్ లో విజయ్ దేవరకొండ సరసన నటించబోతోంది.

పూజా హెగ్డే పేరు ఎందుకు తెరపైకొచ్చింది..

గతంలో విజయ్ దేవరకొండ, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా ఓ సినిమా ఎనౌన్స్ అయింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో జనగణమన అనే ప్రాజెక్టులో వీళ్లు నటించాల్సి ఉంది. దీనికి సంబంధించి పూజాహెగ్డే, కొన్ని రోజులు షూటింగ్ కూడా చేసింది. కానీ లైగర్ డిజాస్టర్ తో జనగణమన సైడ్ అయిపోయింది.

అందుకే తన తాజా చిత్రంలో పూజాహెగ్డేను రిపీట్ చేయాలని విజయ్ దేవరకొండ భావించాడట. ఈ మేరకు ఆయన తన ఆప్షన్ ను నిర్మాత ముందుంచాడు. అయితే కథ ప్రకారం, పూజా హెగ్డే కంటే, మృణాల్ అయితే బాగుంటుందని దర్శకనిర్మాతలు ఫీల్ అవ్వడంతో.. పూజాహెగ్డే కు విజయ్ దేవరకొండ సరసన నటించే అవకాశం మరోసారి మిస్సయినట్టు తెలుస్తోంది.

త్వరలోనే విజయ్ దేవరకొండ, పరశురామ్ మూవీపై ఓ చిన్న ఎనౌన్స్ మెంట్ రాబోతోంది. గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీళ్లిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇదే.