శ్రావణమాసంలో సీఎం జగన్ అక్కడికి…?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రావణ మాసం మంచి ముహూర్తం ఎంచుకుని మరీ విశాఖలో కాలు పెట్టనున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ని విశాఖలో ఏర్పాటు చేసి వైజాగ్ నుంచి ఆయన పాలన చేయడానికి సిద్ధమవుతున్నారు.…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రావణ మాసం మంచి ముహూర్తం ఎంచుకుని మరీ విశాఖలో కాలు పెట్టనున్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ని విశాఖలో ఏర్పాటు చేసి వైజాగ్ నుంచి ఆయన పాలన చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆ మధ్య దాకా సెప్టెంబర్ నెలలో విశాఖ నుంచి మకాం అని జగన్ ప్రకటించారు.

ఇపుడు అనూహ్యంగా సీఎం జగన్ విశాఖ మకాం ముహూర్తం టైం తో పాటు మంత్ కూడా మారింది. విశాఖలోని బీచ్ రోడ్డు ప్రాంతంలో సీఎం నివాసం కోసం ఒక భవనం సిద్ధం అవుతోంది. రుషికొండ వద్ద సీఎం క్యాంప్ ఆఫీస్ కి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

అవి పూర్తి కావడానికి కొంత సమయం పట్టవచ్చు అన్న వార్తల నేపధ్యంలో ముఖ్యమంత్రి జగన్ విశాఖకు ముందే చేరుకుని వేరే భవనంలో బస చేస్తారు అని అంటున్నారు. రుషికొండ భవనం సాధ్యమైనంత త్వరలో పూర్తి అయితే అక్కడికి తరువాత షిఫ్ట్ అవుతారు అని అంటున్నారు.

విశాఖ రాజధాని అన్న వైసీపీ దాన్ని నిజం చేసే పనిలో పడింది. న్యాయపరమైన అవరోధాలు ఏవీ లేకుండా రాకుండా జాగ్రత్త పడుతోంది. రుషికొండ వద్ద సీఎం ఆఫీస్ అన్ని హంగులతో ప్రస్తుతం ముస్తాబు అవుతోంది. ఆగస్ట్ నెలలో శ్రావణ మాసం వస్తుంది. సమస్త శుభాలకు ఆ మాసం ఆరంభం. అందుకే మంచి ముహూర్తం చూసుకుని మరీ విశాఖ వాసిగా జగన్ మారిపోనున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు.