ఛైర్మన్‌ పదవి నుంచి అశోక్‌ గజపతిరాజు తొలగింపు

రామతీర్థం దేవస్థానం ఛైర్మన్‌ పదవి నుంచి అశోక్‌ గజపతిరాజును తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ నిర్వహణలో వైఫల్యం చెందిన నేపథ్యంలో పదవి నుంచి తొలగిస్తూ దేవాదాయశాఖ కార్యదర్శి గిరిజాశంకర్‌ మెమో…

రామతీర్థం దేవస్థానం ఛైర్మన్‌ పదవి నుంచి అశోక్‌ గజపతిరాజును తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ నిర్వహణలో వైఫల్యం చెందిన నేపథ్యంలో పదవి నుంచి తొలగిస్తూ దేవాదాయశాఖ కార్యదర్శి గిరిజాశంకర్‌ మెమో జారీ చేశారు.

రామతీర్ధం సహా 3 ఆలయాల ఛైర్మన్ల పదవి నుంచి ఉద్వాసన పలికింది. పైడితల్లి, తూర్పుగోదావరి జిల్లా మందపల్లి దేవస్థానాల ఛైర్మన్‌ పదవుల నుంచి తప్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 

కాగా, రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో డిసెంబర్‌ 28వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించి, సీతమ్మవారి కొలనులో పడేసిన సంగతి తెలిసిందే.. ఈ సంఘటనపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయం పలు అనుమానాలకు తావిస్తోంది.