4 నుంచి క్రిష్ సినిమాకు పవన్

వకీల్ సాబ్ లో తన పార్ట్ షూట్ ను ఫినిష్ చేసేసారట పవన్ కళ్యాణ్. ఈ మేరకు యూనిట్ అధికారికంగా ప్రకటించింది.నిజానికి పోలాచ్చి వెళ్లి శృతి హాసన్ కాంబినేషన్ లో డ్యూయట్ చిత్రీకరిస్తారు అని…

వకీల్ సాబ్ లో తన పార్ట్ షూట్ ను ఫినిష్ చేసేసారట పవన్ కళ్యాణ్. ఈ మేరకు యూనిట్ అధికారికంగా ప్రకటించింది.నిజానికి పోలాచ్చి వెళ్లి శృతి హాసన్ కాంబినేషన్ లో డ్యూయట్ చిత్రీకరిస్తారు అని నిన్న మొన్నటి వరకు వినిపిస్తూ వచ్చింది. 

కానీ ఆ పాట సినిమా  నుంచి తీసేసారనే టాక్ వినిపిస్తోంది. కేవలం ఒక్క మాంటేజ్ సాంగ్ మాత్రమే చిత్రీకరించినట్లు తెలుస్తోంది. వకీల్ సాబ్ షూట్ పూర్తి కావడంతో క్రిష్ సినిమా మీదకు రాబోతున్నారు పవన్. 

క్రిష్ సినిమాకు సంబంధించి ఓ భారీ సెట్ వుంది. అక్కడ కొంచెం వర్క్ చేసేస్తే, ఆ సెట్ తో పని అయిపోతుంది. అందుకే ముందుగా ఆ వర్క్ ఒక్కటీ పూర్తి చేసి,, అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ మీదకు వస్తారని బోగట్టా.

అయితే అది ఎప్పటి నుంచి అన్నది క్లారిటీ లేదు. అందుకే అయ్యప్పన్ రీమేక్ కోసం అనుకున్న సాయిపల్లవి, ఐశ్వర్య రాజేష్, సముద్రఖని, వెన్నెల కిషోర్, జయరాం లాంటి నటులు ఎవ్వరితోనూ ఇంకా అగ్రిమెంట్లు చేసుకోలేదు. డేట్ లు పక్కాగా తేలితే అగ్రిమెంట్లు అవుతాయని తెలుస్తోంది.

పవన్  ఒక్క క్షణం ఆగి, వెనక్కు తిరిగి చూసుకోవాలి

ముగ్గురు పిల్లల్ని కనాలని ఉంది