మళ్లీ థియేటర్లకు రండి.. ప్రభాస్ పిలుపు

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి. కానీ కొత్త పద్ధతులు, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆక్యుపెన్సీ సగం మాత్రమే. ఇవన్నీ పక్కనపెడితే, ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎన్నో అనుమానాలు, మరెన్నో భయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హీరో…

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి. కానీ కొత్త పద్ధతులు, కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆక్యుపెన్సీ సగం మాత్రమే. ఇవన్నీ పక్కనపెడితే, ప్రేక్షకుల్లో ఇప్పటికీ ఎన్నో అనుమానాలు, మరెన్నో భయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హీరో ప్రభాస్, అందరికీ పిలుపునిచ్చాడు. “థియేటర్లకు వద్దాం.. బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ చేద్దాం” అంటున్నాడు యంగ్ రెబల్ స్టార్.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. మల్టీప్లెక్సులు పూర్తిస్థాయిలో తెరుచుకోగా, సింగిల్ స్క్రీన్స్ ఓ మోస్తరుగా ఓపెన్ అయ్యాయి. ప్రేక్షకులంతా థియేటర్లకు వచ్చి సిల్వర్ స్క్రీన్ మజాను ఆస్వాదించాలని ఇప్పటికే పలువురు హీరోలు పిలుపునిచ్చారు. దీనికి కొనసాగింపుగా ప్రభాస్ కూడా థియేటర్లకు రమ్మంటూ అందర్నీ ఆహ్వానిస్తున్నాడు.

ప్రస్తుతం అన్ని థియేటర్స్ లో కూడా కరోనా నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని థియేటర్లలో జాగ్రత్తలు తీసుకుంటున్నారని.. ప్రేక్షకులు కూడా మాస్కు పెట్టుకొని వచ్చి, బిగ్ స్క్రీన్ అనుభవం మళ్లీ పొందండి అంటూ ప్రభాస్ పిలుపునిచ్చాడు.

ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు స్పందన కొద్దికొద్దిగా పెరుగుతోంది. ప్రభాస్ తో పాటు ఇప్పటికే పలువురు హీరోలు పిలుపునివ్వడంతో పాటు సోలో బ్రతుకే సో బెటర్ లాంటి ఓ మోస్తరు పెద్ద సినిమా రేపు థియేటర్లలోకి వస్తున్న నేఫథ్యంలో.. థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరుగుతుందని అంతా ఆశిస్తున్నారు. చాలామంది సినీప్రముఖులు రేపు థియేటర్లకు వెళ్లడానికి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ముందుగా తాము థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులకు ఓ మంచి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు.