సిఎమ్ జగన్ కు థాంక్స్….ఎన్వీ ప్రసాద్

కోవిడ్ కారణంగా సినీ ఇండ‌స్ట్రీలో షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమా థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి. ఇటీవ‌ల థియేట‌ర్స్‌ను యాబై శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ చేసుకోవ‌చ్చున‌ని ప్ర‌భుత్వాలు అధికారికంగా ప్ర‌క‌టించాయి. అయితే ఎగ్జిబిట‌ర్స్ థియేట‌ర్స్‌ను తెర‌వ‌లేని ప‌రిస్థితి…

కోవిడ్ కారణంగా సినీ ఇండ‌స్ట్రీలో షూటింగ్స్ ఆగిపోయాయి. సినిమా థియేట‌ర్స్ మూత ప‌డ్డాయి. ఇటీవ‌ల థియేట‌ర్స్‌ను యాబై శాతం ఆక్యుపెన్సీతో ఓపెన్ చేసుకోవ‌చ్చున‌ని ప్ర‌భుత్వాలు అధికారికంగా ప్ర‌క‌టించాయి. అయితే ఎగ్జిబిట‌ర్స్ థియేట‌ర్స్‌ను తెర‌వ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. 

ఈ నేప‌థ్యంలో ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్  మూడు నెలలపాటు థియేటర్లు చెల్లించాల్సిన ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్న‌ట్లు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి మల్టీప్లెక్స్‌లు సహా, అన్ని థియేటర్లకూ ఫిక్స్‌డ్‌ ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేయనుంది. 

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సినీ ప‌రిశ్ర‌మ‌కు చేసిన స‌హ‌కారానికి ఎంటైర్ సినీ ఇండ‌స్ట్రీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తోంది. ఈ సంద‌ర్భంగా  ఫిల్మ్ ఛాంబ‌ర్ మాజీ అధ్య‌క్షుడు, నిర్మాత‌, ఎగ్జిబిట‌ర్ ఎన్‌.వి.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వై.ఎస్‌.జ‌గ‌న్‌ సినిమా ప‌రిశ్ర‌మ‌కు అండ‌గా నిల‌బ‌డుతూ చేసిన సాయం ఎన‌లేనిది… వెల‌క‌ట్ట‌లేనిది.  

ఎంఎస్ఎంఈ ప్యాకేజ్ కింద సినీ ప‌రిశ్ర‌మ‌కు ఊర‌ట క‌ల్పించ‌డం ఎంతో సంతోషించ‌ద‌గ్గ ప‌రిణామం. ప‌వ‌ర్ టారిఫ్ మూడు నెల‌లు కాకుండా లాక్‌డౌన్ వ‌ర‌కు అయితే ఇంకా బావుండేది. అయినా ప్ర‌భుత్వం అందించిన ఈ తోడ్పాటుకు  ధ‌న్య‌వాదాలు. థియేట‌ర్స్ ఓపెన్ చేయ‌లేని ప‌రిస్థితిలో ఉన్న‌వారికి ఇది ఊర‌ట‌నిచ్చే అంశం. 

ఈరోజు వైజాగ్‌లో మా సినిమా షూటింగ్ జ‌రుగుతుంటే… ఫ్రెండ్లీ ఎట్మాస్పియ‌ర్‌లో మాకు ప‌ర్మిష‌న్స్ ఇస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ముందుండి ఎంతో తోడ్పాటుని అందిస్తోంది. సినిమా వాళ్ల‌కి టాప్ ప్రియారిటీని అందించి రియ‌ల్ లొకేష‌న్స్‌లో షూటింగ్ చేసుకోవ‌డానికి మాకు స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తున్నారు.

ఈ విష‌యంలో సినిమా ప‌రిశ్ర‌మ‌కు అండ‌గా నిల‌బడ్డ వై.ఎస్‌.జ‌గ‌న్‌గారిని ప్ర‌త్యేకంగా వెళ్లి కలుస్తాం. సినిమా ఇండ‌స్ట్రీలోని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌గ‌లిగే యంగ్ అండ్ డైన‌మిక్ లీడర్ జ‌గ‌న్ ప‌రిష్క‌రిస్తార‌ని భావిస్తున్నాం. 

రాబోయే రోజుల్లో సినిమా ఇండ‌స్ట్రీ హైద‌రాబాద్‌తో పాటు వైజాగ్‌లోనూ అభివృద్ధి చెందుతుంది. మ‌రే సీఎం చేయ‌లేని విధంగా పాలన సాగిస్తున్న జగన్ కు మా అభినందనలు..'' అన్నారు ఎన్వీ ప్రసాద్.

ఫెయిల్యూర్ సినిమా…ప్ర‌మోష‌న్ ఎపిసోడ్