విజయ్-పరుశురామ్-పూజ ఆగిందా?

విజయ్ దేవరకొండ-పరుశురామ్ సినిమా వ్యవహారం చాలా మలుపులు తిరుగుతోంది. నిన్నటికి నిన్న ‘గ్రేట్ ఆంధ్ర’ వీడియో చాలా వైరల్ అయిపోయింది.  Advertisement ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో ఇలాంటి వ్యవహారం అరుదు. ఓ వెల్…

విజయ్ దేవరకొండ-పరుశురామ్ సినిమా వ్యవహారం చాలా మలుపులు తిరుగుతోంది. నిన్నటికి నిన్న ‘గ్రేట్ ఆంధ్ర’ వీడియో చాలా వైరల్ అయిపోయింది. 

ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో ఇలాంటి వ్యవహారం అరుదు. ఓ వెల్ నోన్ హీరో, ఓ వెల్ నోన్ డైరక్టర్ మీద ఇలాంటి ఓపెన్ కామెంట్ అన్నది ఎప్పుడూ లేదు. డైరక్టర్ తో కిట్టకపోతే పక్కన వున్నా కూడా మాట్లాడకపోవడం అన్నవి చూసాం తప్ప ఇలాంటివి కాదు. అందుకే ఇండస్ట్రీ మొత్తం ఈ వీడియో బిట్ తెగ తిరిగేసింది. ట్విట్టర్, ఫేస్ బుక్ ల్లో ఇదే వీడియో వైరల్ అయిపోయింది.

గమ్మత్తేమిటంటే, నిన్నటికి నిన్నే ఇదే సినిమాకు సంబంధించి మరో సంఘటన చాలా సైలంట్ గా జరిగినట్లు తెలుస్తోంది. విజయ్-పరుశురామ్ సినిమాకు పూజ పెట్టాలని నిర్మాత దిల్ రాజు అనుకున్నట్లు తెలుస్తోంది. 

అయితే ఓపెన్ గా కాకుండా జస్ట్ ఫార్మల్ గా, సైలంట్ గా పూజ నిర్వహించాలని అనుకున్నారట. ఈ విషయం తెలిసిన పలువురు గిల్డ్ సభ్యులు కలుగు చేసుకున్నట్లు తెలుస్తోంది.

గిల్డ్ పెద్ద అయి వుండీ, ఓ సినిమా వివాదం తేలకుండా ఇలా చేయడం సరికాదు అని వారించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డిస్కషన్లు సాగిన తరువాత దిల్ రాజు తన సినిమా పూజా కార్యక్రామన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇదిలా వుంటే ఇది వారం రోజుల క్రితమే పూజ వద్దని నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని, దిల్ రాజు నే 14 రీల్స్ తో మాట్లాడి పూజ వద్దని అనుకున్నారని హీరో సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.