రచ్చ రంబోలా.. మళ్లీ మొదలైన అనసూయ ‘వివాదం’

సోషల్ మీడియాలో వివాదాల్ని, అనసూయను వేరు చేసి చూడలేం. బోల్డ్ గా ఉండడం ఆమె స్టయిల్. దీంతో ఆటోమేటిగ్గా వివాదాలు ఆమెను చుట్టుముడుతుంటాయి. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు, అనసూయకు మధ్య…

సోషల్ మీడియాలో వివాదాల్ని, అనసూయను వేరు చేసి చూడలేం. బోల్డ్ గా ఉండడం ఆమె స్టయిల్. దీంతో ఆటోమేటిగ్గా వివాదాలు ఆమెను చుట్టుముడుతుంటాయి. మరీ ముఖ్యంగా విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు, అనసూయకు మధ్య జరిగిన సోషల్ మీడియా వార్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడీ నటి మరోసారి వివాదాస్పదమైంది.

తాజాగా ఖుషి సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది. ఆ పోస్టర్ లో 'ది దేవరకొండ' అని వేశారు. సాధారణంగా పేరు రాస్తే సరిపోతుంది. కానీ ముందు ఇలా 'ది' అనే అక్షరాన్ని చేర్చారు. దీన్ని అనసూయ పట్టుకుంది.

సినిమా పేరు, హీరో పేరు ఏదీ మెన్షన్ చేయకుండా పరోక్షంగా విజయ్ దేవరకొండపై ట్వీట్ వేసింది. పైత్యం ఎక్కువైందని, అది మనకు అంటకుండా జాగ్రత్త పడాలని ట్వీట్ చేసింది.

అనసూయ ట్వీట్ వేసిన వెంటనే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. అనసూయపై మరోసారి ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఎప్పట్లానే ఆంటీ అనే సంభోదనను తెరపైకి తెచ్చిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్.. ఈసారి అసూయఆంటీ అనే హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేశారు.

ఆ వెంటనే అనసూయ కూడా రియాక్ట్ అయింది. “భలే రియాక్ట్ అవుతున్నార్రా బంగారు.. బంగారు కొండలంట.. ఎక్కడో అక్కడో నేను నిజం అనేది ప్రూవ్ చేస్తూనే ఉన్నందుకు థ్యాంక్స్” అంటూ మరింత రెచ్చగొట్టింది. దీంతో దేవరకొండ ఫ్యాన్స్ బూతులు అందుకున్నారు.

అలా పోస్టు అయిన కొన్ని బూతుల్ని కూడా అనసూయ ట్యాగ్ చేసింది. ఇలాంటి తప్పులు చేస్తున్న అభిమానుల్ని నిలదీయడానికి స్టార్ హీరోలకు ఏం అడ్డొస్తోంది, గొప్ప శక్తితోనే గొప్ప బాధ్యత వస్తుంది, నాకు వచ్చిన శక్తితో నేను బాధ్యతగా ఉన్నాను, హీరోలెందుకు అలా లేరు. ఫ్యాన్ ఫోలోయింగ్ పోతుందనా? అలాంటి ఫాలోయింగ్ లేకుంటేనే బెటర్ కదా” అంటూ కాస్త గట్టిగా తగులుతుంది.

అనసూయ తాజా ట్వీట్ తో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. మరికొంతమంది హీరోల ఫ్యాన్స్ కూడా వాళ్లకు మద్దతుగా నిలుస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమా నుంచి అనసూయకు, విజయ్ దేవరకొండ అభిమానులకు మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఎప్పటికప్పుడు అది బయటపడుతూనే ఉంది. ఇప్పుడిలా మరోసారి వివాదానికి ఆజ్యం పోసింది అనసూయ.