రొమాన్సా…ఓ దండం అంటున్న హీరోయిన్‌

అదేదో సినిమాలో ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డంతో అన్నీ మ‌రిచిపోవ‌డం చూశాం. ఇప్పుడు నిజం జీవితంలో కూడా అలాంటి ప‌రిస్థితిని ఓ హీరోయిన్ విష‌యంలో చూస్తున్నాం. కాక‌పోతే రియ‌ల్ లైఫ్‌లో క‌రోనా అనే మ‌హ‌మ్మారి దెబ్బ‌తో అన్నీ…

అదేదో సినిమాలో ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డంతో అన్నీ మ‌రిచిపోవ‌డం చూశాం. ఇప్పుడు నిజం జీవితంలో కూడా అలాంటి ప‌రిస్థితిని ఓ హీరోయిన్ విష‌యంలో చూస్తున్నాం. కాక‌పోతే రియ‌ల్ లైఫ్‌లో క‌రోనా అనే మ‌హ‌మ్మారి దెబ్బ‌తో అన్నీ మ‌రిచిపోవాల్సి వ‌స్తోంద‌ని స‌ద‌రు హీరోయిన్ అంటున్నారు. ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా.

రొమాన్స్  అంటే ఏంటి అనే రీతిలో త‌మ‌న్నా అమాయ‌కంగా  ప్ర‌శ్నిస్తున్నారు. క‌న్న‌డ‌లో సూప‌ర్ హిట్ గా నిలిచిన ల‌వ్ మాక్‌టైల్ కు రీమేక్‌గా  గుర్తుందా సీతాకాలం అనే టైటిల్‌తో  సినిమా తెర‌కెక్కిస్తున్నారు.  నాగ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. 

వెబ్ సిరీస్‌తో పాటు గుర్తుందా సీతాకాలం సినిమా కూడా త‌మ‌న్నా చేస్తున్నారు. ఈ సినిమా రొమాంటిక్ క‌థా నేప‌థ్యంలో సాగుతుంది. అయితే క‌రోనా నుంచి కోలుకున్న త‌మ‌న్నా ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రొమాంటిక్ స‌న్నివేశాల‌కు దూరంగా ఉంటున్న‌ట్టు తేల్చి చెప్పారు.

క‌రోనాకు దూరంగా ఉండాలంటే భౌతిక దూరం ఒక్క‌టే మార్గ‌మ‌ని వైద్యులు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వైర‌స్ రెండోసారి కూడా ఎటాక్ అవుతున్న నేప‌థ్యంలో, మొదటిసారి అనుభ‌వంతో త‌మ‌న్నా చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు …రొమాంటిక్ సీన్ల‌లో న‌టించ‌కూడ‌ద‌నే నిర్ణ‌య‌మే చెబుతోంది.

ఈ రీమేక్ సినిమాలో రొమాన్స్ చేయ‌డం మాత్రం మ‌రిచిపోయాన‌ని ఆమె సెల‌విచ్చారు.  ఆన్‌స్క్రీన్లో రొమాంటిక్ స‌న్నివేశాల్లో న‌టించి చాలా రోజులే అవుతోంద‌ని ఆమె చెప్పుకొచ్చారు. కానీ క‌థ న‌చ్చ‌డంతో ఈ చిత్రానికి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చానని ఆమె పేర్కొన్నారు.

మళ్ళీ అదే ప్రశ్న