విజయ్ తో గోపీచంద్ మలినేని!

గతంలో మాదిరిగా ఇప్పుడు మన హీరోల కోసమే పడిగాపులు పడుతూ కూర్చోవాల్సిన పని లేదు. సరైన కథ వుంటే చాలు..హీరోలు దొరకడం సులువు అవుతుంది. ముఖ్యంగా ఇతర భాషల్లో నిర్మాతలు కరువయిపోతున్నారు. మన నిర్మాతలు…

గతంలో మాదిరిగా ఇప్పుడు మన హీరోల కోసమే పడిగాపులు పడుతూ కూర్చోవాల్సిన పని లేదు. సరైన కథ వుంటే చాలు..హీరోలు దొరకడం సులువు అవుతుంది. ముఖ్యంగా ఇతర భాషల్లో నిర్మాతలు కరువయిపోతున్నారు. మన నిర్మాతలు సరైన కథ, దర్శకుడిని తీసుకెళ్తే, వెంటనే డేట్ లు ఇస్తున్నారు. 

ధనుష్, విజయ్ ఇప్పటికే తెలుగు దర్శకులకు అవకాశాలు ఇచ్చారు. రజనీ కాంత్ కూడా దర్శకుడు బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ధనుష్ మరో సినిమా శేఖర్ కమ్ములతో చేస్తున్నారు. ఇంకో తెలుగు సినిమాకు కూడా ఓకె చెప్పారు. దుల్కర్ సల్మాన్ ఇప్పటికే రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు చేసారు. మరో సినిమా చేయబోతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో మాస్ డైరక్టర్ గోపీచంద్ మలినేని ఓ తెలుగు-తమిళ సినిమా చేయబోతున్నారు. క్రాక్, వీరసింహారెడ్డి సినిమాల సక్సెస్ తరువాత తమిళ హీరో విజయ్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీస్ కు గోపీచంద్ మలినేని తన తరువాత సినిమా చేయాల్సి వుంది. 

ఇక్కడ ఏ హీరో కూడా ఖాళీగా లేరు. మెగాస్టార్ చిరంజీవితో చేయాలని వుంది కానీ, ఆయన ఇటీవలే మైత్రీ సంస్థకు సినిమా చేసారు. అందువల్ల ఈక్వేషన్లు సెట్ కాలేదు.

దాంతో తమిళ హీరో విజయ్ ను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. ఆ మేరకు ప్రాధమిక చర్చలు ముగిసి, గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మిగిలింది సరైన కథ చెప్పి ఒప్పించడమే. వారసుడు తరువాత విజయ్ చేసే తెలుగు-తమిళ సినిమా స్టార్ట్ అవుతుంది.