మరో సీనియర్ హీరోయిన్ కు కరోనా

పరిశ్రమలతో తేడా లేకుండా అందర్నీ ఓ పట్టు పడుతోంది కరోనా. థర్డ్ వేవ్ లో ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ బారిన పడుతున్నారు చాలామంది. ఇందులో భాగంగా…

పరిశ్రమలతో తేడా లేకుండా అందర్నీ ఓ పట్టు పడుతోంది కరోనా. థర్డ్ వేవ్ లో ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ బారిన పడుతున్నారు చాలామంది. ఇందులో భాగంగా సీనియర్ హీరోయిన్ కాజోల్ కూడా కరోనా బారిన పడింది. తనకు వైరస్ సోకినట్టు ఈరోజు ఆమె ప్రకటించింది.

తనకు కరోనా పరీక్షలో పాజిటివ్ వచ్చిందని ప్రకటించిన కాజోల్, ప్రస్తుతం తన ముక్కును చూపించలేదనని, అందుకే తనకు ఎంతో ఇష్టమైన తన కూతురు నవ్వును పోస్ట్ చేస్తున్నానంటూ నైసా దేవగన్ స్మైలింగ్ ఫొటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం కాజోల్ ఐసొలేషన్ లోకి వెళ్లింది.

కాజోల్ కు కరోనా సోకడంతో ఆమె భర్త అజయ్ దేవగన్ కార్యక్రమాలపై ఆ ప్రభావం పడింది. ప్రస్తుతం వరుస షూటింగ్స్, ప్రెస్ మీట్స్ తో బిజీగా ఉన్నాడు అజయ్ దేవగన్. అతడు నటించిన రుద్ర అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ త్వరలోనే డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు రాబోతోంది. దీనికి సంబంధించి తాజాగా ట్రయిలర్ రిలీజైంది. ఈ కార్యక్రమాల్లో అతడు చురుగ్గా పాల్గొన్నాడు. ప్రస్తుతానికి అజయ్ దేవగన్ తన హెల్త్ స్టేటస్ ను వెల్లడించలేదు.

ఇక కాజోల్ కూతురు నైసా దేవగన్ విషయానికొస్తే, ఆమె ఇండియాలో లేదు. సింగపూర్ లో చదువుకుంటోంది. అక్కడ కూడా చదువు పూర్తి చేసుకొని, ఉన్నత చదువుల కోసం స్విట్జర్లాండ్ వెళ్లినట్టు సమాచారం.