ఆ మూడు పార్టీలకు ఈసీ షాక్ !

పశ్చిమ బెంగాల్‌లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్,  శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), సీపీఐ(కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) పార్టీల‌కు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ షాకిచ్చింది. జాతీయ హోదాకు అవ‌స‌ర‌మైన నిబంధ‌న‌లు…

పశ్చిమ బెంగాల్‌లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్,  శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), సీపీఐ(కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా) పార్టీల‌కు కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ షాకిచ్చింది. జాతీయ హోదాకు అవ‌స‌ర‌మైన నిబంధ‌న‌లు క‌లిగి ఉండ‌టంలో ఎన్సీపీ, టీఎంసీ, సీపీఐ పార్టీలు విఫ‌లం కావ‌డంతో జాతీయ హోదాను ర‌ద్దు చేస్తున్న‌ట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌క‌టించింది.

అదే స‌మ‌యంలో ఇటీవల కాలంలో అనేక‌ రాష్ట్రాల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తూ ఓట్ల శాతాన్ని నమోదు చేసుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ హోదా క‌ల్పించింది.  2012లో స్థాపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. మొదట ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. ఇత‌ర‌ రాష్ట్రాల్లో ఎన్నికల బరిలో దిగుతూ పంజాబ్‌లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అలాగే, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ క్రమంలో గుజరాత్‌లో ఐదు అసెంబ్లీ స్థానాలు, 12 శాతం ఓట్లు సాధించి జాతీయ పార్టీకి కావాల్సిన అర్హత సాధించింది.

జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే… కేంద్ర ఎన్నికల సంఘం 1968 ప్రకారం నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో (లేదా) లోక్‌సభలో 2% సీట్లు పొందిన రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలి. ఒకసారి ఒక పార్టీ జాతీయ పార్టీ హోదాను కోల్పోతే, ఆ పార్టీ గుర్తించబడని రాష్ట్రాల్లో దాని అభ్యర్థులకు ఉమ్మడి గుర్తును పొందలేవు.

అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో బీఆర్ఎస్ కు రాష్ట్ర పార్టీ గుర్తింపును ర‌ద్దు చేసింది. 2014, 2019 ఎన్నికల్లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏపీలో బీఆర్‌ఎస్‌ పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ గుర్తింపును ఉప సంహరించింది. కాగా టీడీపీ జాతీయ పార్టీ కాక‌పోయిన జాతీయ అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు నాయుడు కొన‌సాగుతున్నా విష‌యం తెలిసిందే.