మైత్రీ చేతిలో ‘ఆ అమ్మాయి’

దర్శకుడు ఇంద్రగంటి హీరో సుధీర్ బాబు కాంబినేషన్ లో బెంచ్ మార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. కృతి శెట్టి కథానాయిక. ఈ చిన్న సినిమా మీద మంచి…

దర్శకుడు ఇంద్రగంటి హీరో సుధీర్ బాబు కాంబినేషన్ లో బెంచ్ మార్క్ స్టూడియోస్ నిర్మిస్తున్న సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. కృతి శెట్టి కథానాయిక. ఈ చిన్న సినిమా మీద మంచి అంచనాలు వున్నాయి. 

ఇప్పడు ఈ సినిమా మైత్రీ మూవీస్ చేతిలోకి వచ్చింది. ఈ సినిమా మీద ఆసక్తితో మైత్రీ మూవీ మేకర్స్ తమ బ్యానర్ ను దానికి యాడ్ చేసారు. 

నిజానికి ఇంద్రగంటి మోహనకృష్ణ ఓ భారీ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ కోసం చేయాల్సి వుంది. భారీ ఖర్చుతో కూడుకున్న ఆ కథ రెడీగా వుంది. కానీ వి సినిమా ఫలితం తరువాత ముందుగా ఓ చిన్న సినిమా చేయాలని ఇంద్రగంటి ఫిక్స్ అయ్యారు. 

ఆ మేరకు ఈ సినిమా తయారవుతోంది. బహుశా దీని తరువాత మైత్రీ మూవీ మేకర్స్ లో సినిమా వుండొచ్చు.