ప్రభాస్ కోసం జాతిరత్నం

భలే కుదిరిందిగా..బాహుబలి ప్రభాస్ రాధేశ్యామ్ ట్రయిలర్ లాంచ్ ఫంక్షన్ కు హోస్ట్ ఎవరు అన్నది. అనకూడదు కానీ యాంకర్ సుమ మాత్రమే ఇప్పుడు టాలీవుడ్ కు దిక్కయిపోయింది.  Advertisement ఏ ఫంక్షన్ అయినా లక్షన్నర…

భలే కుదిరిందిగా..బాహుబలి ప్రభాస్ రాధేశ్యామ్ ట్రయిలర్ లాంచ్ ఫంక్షన్ కు హోస్ట్ ఎవరు అన్నది. అనకూడదు కానీ యాంకర్ సుమ మాత్రమే ఇప్పుడు టాలీవుడ్ కు దిక్కయిపోయింది. 

ఏ ఫంక్షన్ అయినా లక్షన్నర ఇచ్చి సుమను తెచ్చి హోస్టింగ్ చేయించుకోవాల్సిందే. ఆమెకు మాత్రమే సినిమా జనాలతో ఆ చనువు, యాక్సెస్ వుంది. అందువల్ల ఆమె ఎలా మాట్లాడినా ఓకె. మిగిలిన యాంకర్లు ఇంకా ఆ రేంజ్ కు చేరలేదు. అందువల్ల వారు చనువుగా డైలాగులు కట్ చేయలేరు. 

కానీ దాని వల్ల ప్రతి పంక్షన్ ఒకేలా కనిపిస్తున్నాయి. బోర్ కొడుతున్నాయి. ప్రభాస్ రాధేశ్యామ్ కు కొత్తగా ప్రయత్నిస్తున్నారు. మన టాలీవుడ్ 'జాతిరత్నం' నవీన్ పోలిశెట్టిని హోస్ట్ గా తీసుకువచ్చారు. ప్రభాస్ తో, యువి బ్యానర్ తో వున్న అనుబంధంతో దీనికి ఓకె అన్నాడు నవీన్.

కచ్చితంగా వైవిధ్యంగా వుంటుంది. ఇలా కొత్తగా, క్రేజీగా ట్రయ్ చేయడం అందరికీ సాధ్యం కాదు. రెగ్యులర్ గా సుమ మార్క్ పంచ్ లు, మాటలు వింటూ కార్యక్రమం కానిచ్చేయాల్సిందే.