ఫైనల్ కు వచ్చిన ‘టైగర్’

హీరో రవితేజ లేటెస్ట్ సినిమా టైగర్ నాగేశ్వరరావు. స్టూవర్ట్ పురం గజదొంగ కథ నేపథ్యంలో తయారవుతున్న సినిమా ఇది. పీరియాడిక్ ఫిల్మ్ కావడంతో భారీ ఖర్చుతో నిర్మాణమవుతోందీ సినిమా. ఈ సినిమా కోసం ఏకంగా…

హీరో రవితేజ లేటెస్ట్ సినిమా టైగర్ నాగేశ్వరరావు. స్టూవర్ట్ పురం గజదొంగ కథ నేపథ్యంలో తయారవుతున్న సినిమా ఇది. పీరియాడిక్ ఫిల్మ్ కావడంతో భారీ ఖర్చుతో నిర్మాణమవుతోందీ సినిమా. ఈ సినిమా కోసం ఏకంగా ఓ విలేజ్ నే నిర్మించారు. 

స్టూవర్ట్ పురం విలేజ్ ను నిర్మించి అక్కడ షూట్ చేసారు. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. సినిమా ఫైనల్ షెడ్యూలు ను విశాఖలో ప్లాన్ చేసారు. ఈ మేరకు మూడు రోజుల పాటు విశాఖలో భారీ ఎత్తున షూటింగ్ ఏర్పాట్లు చేసారు. విశాఖ సముద్రం నేఫథ్యంలో భారీ నైట్ షూటింగ్ ఏర్పాట్లు చేసారు.

టైగర్ నాగేశ్వరరావు డిఫరెంట్ బయోపిక్. ఇప్పటి వరకు పేరు తెచ్చుకున్న గొప్పోళ్ల గురించి బయోపిక్ లు తీసారు. అలాంటిది ఓ గజదొంగ గురించి బయోపిక్ తీయడం అన్నది తొలిసారి అనుకోవాలి. దర్శకుడు వంశీకృష్ణ తో అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రవితేజ సినిమాల్లో భారీ చిత్రంగా తయారవుతోందీ సినిమా. 

నూపర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏస్ ఫోటోగ్రాఫర్ మాధి వర్క్ చేస్తున్న సినిమాకు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.