‘త్రిమూర్తుల’ ప్రెస్ మీట్ రేపు

దిల్ రాజు, యువి వంశీ, డివివి దానయ్య రేపు మీడియా ముందుకు వస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతి పోటీ నుంచి తప్పించాలని హీరో పవన్ కళ్యాణ్ ను మీడియా ముఖంగా కోరనున్నారు.  Advertisement…

దిల్ రాజు, యువి వంశీ, డివివి దానయ్య రేపు మీడియా ముందుకు వస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమాను సంక్రాంతి పోటీ నుంచి తప్పించాలని హీరో పవన్ కళ్యాణ్ ను మీడియా ముఖంగా కోరనున్నారు. 

ఇదంతా ముందుగా రచించిన స్క్రిప్ట్ గా కనిపిస్తోంది. తాము ఇలా అప్పీల్ చేస్తామని దర్శకుడు త్రివిక్రమ్ కు సమాచారం అదించినట్లు తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ వ్యవహారం చూస్తుంటే కూడా భీమ్లా నాయక్ ను సంక్రాంతి బరిలోకి తీసుకురావడం అంత సేఫ్ కాదని నిర్మాతలు భావిస్తున్నట్లు బోగట్టా. అయితే మర్యాదపూర్వకంగా బరిలోంచి తప్పుకోవాల్సి వుంది. ఫ్యాన్స్ హర్ట్ కాకూడదు. దానికి చాలా పెద్ద స్కీమ్ నే రచించినట్లు కనిపిస్తోంది.

పవన్ కళ్యాణ్ ఇక్కడ వున్నన్నాళ్లు కాకుండా సరిగ్గా ఆయన విదేశీ ప్రయాణం పెట్టుకున్న రోజే వాయిదా కథ మొత్తం ముగించేలా కనిపిస్తోంది. 

ఇటు రాధేశ్యామ్, అటు ఆర్ఆర్ఆర్ నిర్మాతలు అప్పీల్ చేయడం, దానికి పవన్ సై అనడం చకచకా జరిగిపోతాయి. భీమ్లా నాయక్ ఫిబ్రవరి 24 లేదా 25 కు వాయిదా పడిపోతుంది. దాంతో కథ కంచికి.