తమన్న తల్లిదండ్రులకు కరోనా

మిల్కీ బ్యూటీ తమన్న ఇంటిని కరోనా తాకింది. ఈ హీరోయిన్ తల్లిదండ్రులిద్దరూ కరోనా బారిన పడ్డారు. తన అమ్మా-నాన్నకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా తమన్న బయటపెట్టింది. Advertisement “గడిచిన వారం రోజులుగా నా…

మిల్కీ బ్యూటీ తమన్న ఇంటిని కరోనా తాకింది. ఈ హీరోయిన్ తల్లిదండ్రులిద్దరూ కరోనా బారిన పడ్డారు. తన అమ్మా-నాన్నకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా తమన్న బయటపెట్టింది.

“గడిచిన వారం రోజులుగా నా తల్లిదండ్రులు స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఎందుకైనా మంచిదని ఇంట్లో అందరం కరోనా పరీక్షలు చేయించుకున్నాం. ఇప్పుడే ఫలితాలు వచ్చాయి. దురదృష్టవశాత్తూ నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్ వచ్చింది.”

ఇలా తన తల్లిదండ్రులకు కరోనా సోకిన విషయాన్ని ప్రకటించింది తమన్న. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం అమ్మా-నాన్న ఇద్దరూ హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారని తెలిపిన ఈ హీరోయిన్.. దేవుడి దయ, అందరి ప్రేమాభిమానాల వల్ల ఇద్దరూ త్వరగా కోలుకుంటున్నారని తెలిపింది.

ఇంట్లో తల్లిదండ్రులకు తప్ప మిగతా ఎవ్వరికీ కరోనా సోకలేదని తమన్న స్పష్టంచేసింది. తనకు కూడా కరోనా నెగెటివ్ వచ్చిందని తెలిపింది. తమన్న హీరోయిన్ గా “గుర్తుందా  శీతాకాలం” అనే సినిమా రేపు ప్రారంభంకాబోతోంది. సత్యదేవ్ ఇందులో హీరో. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది తమన్న.