14 మందితో ఎఫైర్.. అందరిపై పరువునష్టం దావా

తన భార్య 14 మందితో అక్రమ సంబంధం పెట్టుకుంటే.. అది చూసి తట్టుకోలేకపోయిన భర్త దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. తన పరువుకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తూ.. భార్యతో పాటు ఏకంగా ఆ 14 మందిపై…

తన భార్య 14 మందితో అక్రమ సంబంధం పెట్టుకుంటే.. అది చూసి తట్టుకోలేకపోయిన భర్త దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. తన పరువుకు భంగం వాటిల్లిందని ఆరోపిస్తూ.. భార్యతో పాటు ఏకంగా ఆ 14 మందిపై పరువునష్టం దావా వేశాడు. కోల్ కతాలో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కోల్ కతాకు చెందిన ఓ వ్యాపారవేత్త రెండేళ్ల కిందట ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరి కాపురం సజావుగానే సాగుతోంది. అయితే దాదాపు 7-8 నెలలుగా తన భార్య ప్రవర్తనలో మార్పును గమనించాడు భర్త. తనను దగ్గరకు రానివ్వడం లేదని, కుంటిసాకులు చెబుతోందని గుర్తించాడు. దీంతో అనుమానం వచ్చి ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ను నియమించాడు.

మహిళ కదలికలపై గట్టిగా నిఘాపెట్టిన ప్రైవేట్ డిటెక్టివ్.. వ్యాపారవేత్తకు దిమ్మతిరిగే సమాచారం అందించాడు. భార్య ఒకరు ఇద్దరితో కాదు.. ఏకంగా 14 మందితో చాలా చనువుగా ఉంటోందనే విషయం తెలుసుకున్న భర్త ఖంగుతిన్నాడు. వీళ్లలో ఎంతమందితో ఆమెకు అక్రమ సంబంధం ఉందనే విషయాన్ని పక్కనపెడితే.. ప్రతి రోజూ ఈ 14 మందితో ఆమె టచ్ లో ఉంటోందనే విషయాన్ని మాత్రం నిర్థారించుకున్నాడు.

తనతో కాపురం చేయకపోవడానికి ఈ 14 మందే కారణమని గుర్తించిన సదరు పారిశ్రామికవేత్త, తన భార్యతో పాటు ఆ 14 మందిపై 100 కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేశాడు. తన పరువుకు భంగం కలిగేలా వీళ్లంతా ప్రవర్తించారని ఆరోపించిన ఈ బిజినెస్ మేన్.. సకాలంలో డబ్బు చెల్లించకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవుతానని హెచ్చరించాడు. భార్య అక్రమ సంబంధంలో కూడా ఇలా తన బిజినెస్ తెలివితేటలు వాడాడు ఈ భర్త.

ఇంట‌ర్ లో ఉన్న‌ప్పుడే అర్జీవీతో నా ప్ర‌యాణం మొద‌లైంది

లోకేష్ ని చూస్తే వణుకు వచ్చేస్తుంది