సాయి తేజ్…లోగో వచ్చేస్తోంది

ప్రతి రోజూ పండగే అంటూ మారుతి డైరక్షన్ లో సినిమా ఫినిష్ చేస్తూనే, సుబ్బు అనే కొత్త డైరక్టర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు సాయి తేజ్. Advertisement బోగవిల్లి ప్రసాద్ నిర్మాణంలో ప్రారంభమయ్యే…

ప్రతి రోజూ పండగే అంటూ మారుతి డైరక్షన్ లో సినిమా ఫినిష్ చేస్తూనే, సుబ్బు అనే కొత్త డైరక్టర్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు సాయి తేజ్.

బోగవిల్లి ప్రసాద్ నిర్మాణంలో ప్రారంభమయ్యే ఈ సినిమాకు పూజా కార్యక్రమం రేపు జరగబోతోంది. ప్రస్తుతానికి ఆఫీసులో పూజ కార్యక్రమం నిర్వహిస్తారు.

తరువాత మరో మంచి రోజున షూట్ స్టార్ట్ చేస్తారు. నవంబర్ ఆఖరుతో మారుతి డైరక్షన్ లో సినిమా వర్క్ పూర్తవుతుంది. అప్పటి నుంచి సుబ్బు డైరక్షన్ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ లోగానే మరో సినిమాను కూడా ఓకె చేసే ఆలోచనలో హీరో వున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఒకరిద్దరు డైరక్టర్ల కథలు విన్నట్లు బోగట్టా. చిత్రలహరి సినిమా తరువాత సాయి తేజ్ కాస్త జోరు పెంచాడు. సత్యరాజ్ కాంబినేషన్ తో చేసే ప్రతి రోజూ పండగే సినిమా మీద మంచి హొప్ తో వున్నాడు. ఈ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్.

సాయితేజ్ తో రాశీఖన్నాకు రెండు హిట్ లు వున్నాయి. ఇప్పుడు హ్యాట్రిక్ అవుతుందనే ఆశతో వున్నారు.