బోయపాటి కన్నా ముందు మలినేని?

ఆంధ్రలో వైఎస్ జ‌గన్ ప్రభుత్వం మీద గట్టిగా రాజ‌కీయ విమర్శలు చేస్తూ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో వున్నారు దర్శకుడు బోయపాటి అని వార్తలు వున్నాయి.  Advertisement బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో నిర్మించే…

ఆంధ్రలో వైఎస్ జ‌గన్ ప్రభుత్వం మీద గట్టిగా రాజ‌కీయ విమర్శలు చేస్తూ సినిమా స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో వున్నారు దర్శకుడు బోయపాటి అని వార్తలు వున్నాయి. 

బోయపాటి-బాలయ్య కాంబినేషన్ లో నిర్మించే ఈ సినిమా అటు 14 రీల్స్ లేదా ఇటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తాయి. ఈ సినిమా పూర్తిగా 2024 ఎన్నికలను టార్గెట్ చేసి తయారుచేస్తారని వార్తలు వున్నాయి.

ఇదిలా వుంటే ఈ సినిమా కన్నా ముందుగానే బాలయ్య సినిమాలో వర్తమాన రాజ‌కీయాల మీద పవర్ ఫుల్ డైలాగులు వీరసింహా రెడ్డి సినిమాలో పెట్టేసారని తెలుస్తోంది. ఆంధ్రలో అభివృద్ది లేదు అన్నది తెలుగుదేశం పార్టీ పదే పదే చెబుతున్న మాట. ఆ పార్టీ దృష్టిలో వేల స్కూళ్లు కొత్తగా మార్చడం, వేల ఆసుపత్రులు కొత్తగా మార్చడం అభివృద్ది కాదు. అదంతా వేరే సంగతి.

అయితే తెలుగుదేశం పార్టీ అజెండాకు అనుగుణంగా దర్శకుడు గోపీచంద్ మలినేని తన సినిమాలో రెండు మూడు డైలాగులు పేల్చినట్లు బోగట్టా. ఈ సినిమాకు మాటల రచయిత బుర్రా సాయి మాధవ్. ఆయనకు రాజ‌కీయాల పట్ల అవగాహన బాగానే వుంది. అందువల్ల సరైన డైలాగులే పేల్చి వుంటారేమో? సంక్రాంతికి సినిమా విడుదల అయితే ఈ విషయంలో క్లారిటీ వస్తుంది.