యనమల మీద విజయసాయిరెడ్డి ఫైర్!

తెలంగాణ లబ్ధికోసమని ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాభివృద్ధికి గండికొడుతున్నారంటూ మాజీమంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీకి ఇలాంటి ప్రచారాలు…

తెలంగాణ లబ్ధికోసమని ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాభివృద్ధికి గండికొడుతున్నారంటూ మాజీమంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశం పార్టీకి ఇలాంటి ప్రచారాలు మామూలే అని, వాటిని ప్రజలు తిరస్కరించినా అలాంటి ప్రచారాలనే టీడీపీ నమ్ముకుంటూ ఉంటుందని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

''ఏమైంది యనమల గారూ? తెలంగాణ లబ్దికోసం జగన్ గారు రాష్ట్రాభివృద్ధికి గండికొడుతున్నారా? ఆర్ధికమంత్రిగా రాష్ట్రాన్ని20 ఏళ్లు వెనక్కు నెట్టిన ఘనులు మీరు. ఎన్నికల ముందు కూడా ఇలాగే కేసీఆర్, మోదీలతో చేతులు కలిపామని ఆరోపణలు చేస్తే ప్రజలు మీపై తుపుక్కున ఉమ్మిన సంగతి మరిచారా?'' అంటూ ఆయన విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇక రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై కూడా సాయి రెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడుకు రియలెస్టేట్ సమస్యలు తప్ప మరోటి కనిపించవని ఎద్దేవా చేశారు. ''రాజధాని ప్రాంతం వరదలో మునిగినప్పటి నుంచి అక్కడ భూములు కొన్నవారంతా బట్టలు చించుకుంటున్నారు. రాజధాని తరలిపోతే కోట్ల పెట్టుబడులు ఏమైపోతాయని పీడ కలలు కంటున్నారు. చంద్రబాబు గారేమో హైదరాబాదులో ధరలు పెరుగుతున్నాయని అంటారు. రియల్ ఎస్టేట్ తప్ప ఇంకే సమస్యలు కనిపించడం లేదా మీకు?'' అంటూ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

జనం విజ్ఞతను తక్కువగా చూస్తే పవన్‌కే నష్టం