యాత్ర 2 కథే…ఆర్జీవీ వ్యూహం?

వైఎస్సార్ బయోపిక్..యాత్ర. ఎవరినీ ఏమీ విమర్శంచకుండా, కాంట్రావర్సీల జోలికి పోకుండా, అందరికీ నచ్చేలూ,స్మూత్ గా సున్నితంగా తీసిన బయోపిక్. దీనికి కొనసాగింపుగా యాత్ర 2 సినిమా చేయాలన్నది దర్శకుడు మహి (రాఘవ) ఆలోచన. బహుశా…

వైఎస్సార్ బయోపిక్..యాత్ర. ఎవరినీ ఏమీ విమర్శంచకుండా, కాంట్రావర్సీల జోలికి పోకుండా, అందరికీ నచ్చేలూ,స్మూత్ గా సున్నితంగా తీసిన బయోపిక్. దీనికి కొనసాగింపుగా యాత్ర 2 సినిమా చేయాలన్నది దర్శకుడు మహి (రాఘవ) ఆలోచన. బహుశా 2023లో మొదలుపెడతారేమో? కానీ ఈ లోగానే దర్శకుడు ఆర్జీవీ రెండు భాగాల సినిమాలు ప్రకటించారు.

ఒకటి వ్యూహం, రెండవది శపథం. ఈ రెండు భాగాల్లో ఏమి కథాంశాలు వుంటాయో అన్నది తెలియాల్సి వుంది. ఇప్పటికే ఆర్జీవీ ప్రకటించన దాని ప్రకారం జగన్ సిఎమ్ కావడానికి ముందు కథే శపథం సినిమా అని తెలుస్తోంది.

 వైఎస్ మరణించడం, జగన్ జనాల్లోకి వెళ్లడం, ఓడి పోవడం, మళ్లీ జనాల్లోకి వెళ్లడం, గెలిచి సిఎమ్ కావడం అన్న అంశాలు తొలి భాగంలో వుంటాయట. జగన్ కు వ్యతిరేకంగా కిందా పడిన ప్రతి పాత్ర ఈ భాగంలో వుంటుందని తెలుస్తోంది. జగన్ సిఎమ్ అయిన తరువాత అంశాలు రెండో భాగంలో వుంటాయి. అది వేరే సంగతి.

ఇక్కడ గమ్మత్తేమిటంటే, వైఎస్ మరణం దగ్గర ఆగిన యాత్ర సినిమాను జగన్ సిఎమ్ కావడంతో ముగిసేలా కథ రాసి దానికి యాత్ర 2 అని రెడీ చేసుకున్నారు మహి. సీన్లు వేరు వుండొెచ్చు.చెప్పే విధానం వేరుగా వుండొచ్చు. కానీ అటు ఆర్జీవీ, ఇటు మహి చెప్పబోయే కథాంశాలు రెండూ ఒక్కటే. కానీ ఆర్జీవీ సినిమా ను అందరూ లైట్ తీసుకుంటారు. 

మహి సినిమాకు ఇంతో అంతో క్రెడిబులిటీ వుంటుంది. కానీ ఆర్జీవీ తీసేసిన తరువాత అదే కథాంశంతో మహి మళ్లీ సినిమా తీస్తారో, తీయరో చూడాలి.