మరిచిపోయిన సినిమాకు జాకీలు

దర్శకుడు పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ తో రొమాంటిక్ అనే సినిమా స్టార్ట్ చేసారు. కానీ ఇస్మార్ట్ శంకర్ హిట్ వచ్చాక, లైగర్ సినిమాను తలెకెత్తుకుని ఈ సినిమాను ఏనాడో పక్కన పెట్టారు. …

దర్శకుడు పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ తో రొమాంటిక్ అనే సినిమా స్టార్ట్ చేసారు. కానీ ఇస్మార్ట్ శంకర్ హిట్ వచ్చాక, లైగర్ సినిమాను తలెకెత్తుకుని ఈ సినిమాను ఏనాడో పక్కన పెట్టారు. 

లైగర్ సినిమా ఫినిష్ అయిన తరువాత కానీ ఇది పట్టాలు ఎక్కదు. కానీ ఈలోగా జనం మరిచిపోతున్నారని, మళ్లీ జాకీలు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారు.

గతంలో వరుసపెట్టి ఆకాష్-కేతిక శ‌ర్మ‌ల రొమాంటింగ్ అడల్ట్ టచ్ స్టిల్స్ చాలా వదిలేసారు. ఇప్పుడు మళ్లీ అదే కార్యక్రమానికి తెరతీసినట్లు కనిపిస్తోంది. లైగర్ సినిమా ఎలాగూ ఈ ఏడాది రాదు. . 

అప్పటి వరకు లైవ్ లో వుంచడానికి ఈ స్టిల్స్ పనికి వస్తాయని భావిస్తున్నారేమో? ఎంత సేపు వదిలినా అవే ఇంటిమసీ, అడల్ట్ టచ్ స్టిల్స్. కానీ సినిమా పూర్తయిపోయింది. త్వరలో విడుదల అంటున్నారు. అంటే పూరి ప్రమేయం లేకుండా పూర్తి చేసేసారా? ఎందుకంటే పూరి ఇప్పుడు ముంబాయిలో వుంటున్నారు.అందువల్ల ఈ సినిమా మీద దృష్టి పెట్టే అవకాశం లేదు. 

మరి తొందర పడి సినిమాను ఎందుకు విడుదల చేస్తున్నట్లో? పైగా ఇలాంటి స్టిల్స్ నే సదా విడుదల చేయడం ద్వారా ఆకాష్ పూరి ని ఏ తరహా హీరోగా నిలబెట్టాలని అనుకుంటున్నట్లో? పైగా ఆకాష్ కు ఇదే ఫస్ట్ బ్రేక్ అంటున్నారు. అంటే గతంలో సినిమాలు అన్నీ….?