ఇన్ స్టా కామెంట్స్ సెక్ష‌న్ క్లోజ్ చేసిన హీరోయిన్లు!

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత కొంత‌మంది బాలీవుడ్ స్టార్స్ పై ఫ్యాన్స్ దుమ్మెత్తి పోసిన సంగ‌తి తెలిసిందే. సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు బాలీవుడ్ లో తీవ్రంగా ఉన్న బంధుప్రీతే కార‌ణ‌మ‌ని…

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య త‌ర్వాత కొంత‌మంది బాలీవుడ్ స్టార్స్ పై ఫ్యాన్స్ దుమ్మెత్తి పోసిన సంగ‌తి తెలిసిందే. సుశాంత్ ఆత్మ‌హ‌త్య‌కు బాలీవుడ్ లో తీవ్రంగా ఉన్న బంధుప్రీతే కార‌ణ‌మ‌ని అనేక మంది విమ‌ర్శించారు. వార‌స‌త్వంతో సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి సెటిలైన తార‌ల మీద‌, వార‌సుల‌ను బాగా ఎంక‌రేజ్ చేస్తాడ‌నే పేరున్న క‌ర‌ణ్ జొహార్ మీద , సుశాంత్ ను ప‌లు సినిమాల నుంచి త‌ప్పించార‌నే అభియోగాల‌తో సినీ అభిమానులు తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. కొంద‌రిని ప‌ర్స‌న‌ల్ గా టార్గెట్ చేశారు.

సోష‌ల్ మీడియాలో కొంద‌రి ఫాలోయింగ్ కూడా త‌గ్గిపోయింది. వారిని జ‌నాలు ఆ స్థాయిలో అస‌హ్యించుకుంటున్న ప‌రిస్థితి! ఈ ప‌రిణామాన్ని ఊహించ‌లేదు ఆ సినీ తార‌లు కూడా. సుశాంత్ మ‌ర‌ణంతో వారికేం సంబంధం అనే వాద‌నా లేక‌పోలేదు. ఇది ఎలాగూ తేలే అంశం కాదు. అయితే స‌ద‌రు తార‌ల‌ను ఇప్ప‌ట్లో జ‌నాలు వ‌దిలేరా లేరు కూడా.

ఈ క్ర‌మంలో త‌మ ఇన్ స్టాగ్ర‌మ్ పోస్టుల‌కు కామెంట్ల‌ను నియంత్రిస్తున్నారు కొంద‌రు బాలీవుడ్ తార‌లు. త‌మ పోస్టుల‌కు ఎవ‌రంటే వాళ్లు కామెంట్లు పెట్ట‌కుండా వారు కామెంట్ సెక్ష‌న్ ను లాక్ చేసుకున్నార‌ట‌. త‌మ క్లోజ్ ఫ్రెండ్స్ లిస్టులోని వారు త‌ప్ప‌, వారి సామాన్య ఫాలోయ‌ర్లు ఎవ‌రూ కామెంట్లు పెట్ట‌కుండా వాళ్లు సెట్టింగ్స్ ను మార్చుకున్నార‌ట‌. ఈ జాబితాలో అలియా భ‌ట్, క‌ర‌ణ్ జొహార్, క‌రీనా క‌పూర్, అన‌న్యా పాండే వంటి వాళ్ల‌తో పాటు షారూక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా ఈ ప‌నే చేసింద‌ట‌. సుశాంత్ మ‌ర‌ణం త‌ర్వాత తీవ్ర‌మైన నెగిటివ్ కామెంట్స్ వ‌స్తుండ‌టంతో వీళ్లంతా ఈ ప‌ని చేశార‌ని తెలుస్తోంది.

కల్నల్ భార్యకు డిప్యూటీ కలెక్టర్ హోదా

ఏపీలో రేపటినుంచి కొత్త రాజకీయం