సినిమా జనాలకు అంత ధైర్యం వుందా?

ఆంధ్ర సిఎమ్ జగన్ ను కలవడానికి బయల్దేరారు సినిమా జనాలు. ఏడాది దాటుతోంది జగన్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి. ఇప్పటి వరకు అభినందించడానికి టాలీవుడ్ కు మనసు రాలేదు. కానీ ఇప్పుడు విశాఖలో సినిమా…

ఆంధ్ర సిఎమ్ జగన్ ను కలవడానికి బయల్దేరారు సినిమా జనాలు. ఏడాది దాటుతోంది జగన్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి. ఇప్పటి వరకు అభినందించడానికి టాలీవుడ్ కు మనసు రాలేదు. కానీ ఇప్పుడు విశాఖలో సినిమా పరిశ్రమ అభివృద్దిపై జగన్ ఆలోచిస్తున్నారని వార్తలు అందగానే, అవకాశాలు అందిపుచ్చుకోవడానికి పొలోమంటూ బయల్దేరారు. ఇఫ్పుడు ఇదే విషయాన్ని నిలదీస్తున్నారు అమరావతిని రాజధానిగా కోరుకుంటున్నవారు.

అమరావతి జెఎసి మహిళా విభాగం నేత సుంకర పద్మశ్రీ ఈ విషయమై ఘాటైన వ్యాఖ్యలు చేసారు. అమరావతి గురించి దానికి భూములు ఇచ్చిన వారి గురించి మీకు పట్టదు కానీ, ఆంధ్రలో మీకు భూములు కావాలా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు. అమరావతిని రాజధానిగా వుంచమని సిఎమ్ జగన్ కు చెప్పి, రియల్ హీరోస్ అనిపించుకోమని కోరతున్నారు.

కానీ మన సినిమా జనాలకు అంత సీనుంటుందా? అన్నది ప్రశ్న. 

''….మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, అమరావతినే రాజధానిగా కొనసాగించమని జగన్‌కి చెప్పండి….''

అని సుంకర పద్మశ్రీ అడుగుతున్నారు. నిజంగా మన టాలీవుడ్ జనాలు జగన్ దగ్గరకు వెళ్లి ఇలా అడగగలరా? అసలు ఆ టాపిక్ నే రైజ్ చేయగలరా? అయినా సినిమా జనాలకు అమరావతికే కాదు, ఆంధ్ర అంతటికీ జనాలు కదా?

తమ్ముడు అలా.. అన్న ఇలా

జన్వాడ ఫామ్ హౌస్ రహస్యాలు