లోకేష్ మరో ట్విట్టర్ ఛాలెంజ్!

ట్విట్టర్ రాజకీయాలకే పరిమితం అయిన నారా లోకేష్ అక్కడే తన రాజకీయ విద్యనంతా ప్రదర్శిస్తూ కొనసాగుతూ ఉన్నారు! ఒక ప్రెస్ మీట్ పెట్టి సమాధానాలు ఇచ్చే చేవ చూపించకుండా.. మాట్లాడటానికి మండలిలో అవకాశం వచ్చినప్పుడు దులిపేయకుండా..…

ట్విట్టర్ రాజకీయాలకే పరిమితం అయిన నారా లోకేష్ అక్కడే తన రాజకీయ విద్యనంతా ప్రదర్శిస్తూ కొనసాగుతూ ఉన్నారు! ఒక ప్రెస్ మీట్ పెట్టి సమాధానాలు ఇచ్చే చేవ చూపించకుండా.. మాట్లాడటానికి మండలిలో అవకాశం వచ్చినప్పుడు దులిపేయకుండా.. లోకేష్ కేవలం ట్విట్టర్ కే పరిమితం అవుతూ ఉన్నారు. తాజాగా ఆయన ఆ సోషల్ మీడియా సైట్లో మరో సవాల్ విసిరారు. తమ రాజకీయ ప్రత్యర్థులకు లోకేష్ అక్కడ నుంచినే లోకేష్ ట్వీట్ సవాల్ చేశారు! ఈసారి తన మామయ్య బాలకృష్ణను వెనకేసుకుని వస్తూ లోకేష్ ట్వీట్ చేశారు.

అమరావతి ప్రాంతంలో బాలకృష్ణ, ఆయన బినామీలకు భారీఎత్తున భూములు కొనుగోలు చేశారు అనే ఆరోపణలపై లోకేష్ ట్వీట్ తో సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ''వైకాపా నాయకులు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనుకుంటున్నారు. వాళ్ళ ఫేక్ బతుకు మారలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అసత్యాలతో కాలం నెట్టుకొస్తున్నారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని దెబ్బతియ్యడానికి ఇన్ సైడ్ ట్రేడింగ్ అంటూ బురద జల్లుతున్నారు. తండ్రి అధికారాన్నీ, శవాన్నిపెట్టుబడిగా పెట్టి ఎదిగిన చరిత్ర మీ నాయకుడిది.

తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా.. ఏ రోజూ అటువైపు కూడా చూడకుండా స్వఛ్చమైన మనస్సు, నీతి, నిజాయితీతో ఎదిగారు మా బాలా మావయ్య. అటువంటి వ్యక్తి రాజధానిలో భూములు కొన్నారని ఆరోపణలు కాదు, దమ్ముంటే నిరూపించండి. లేక రాజధాని రైతులకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి.''అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్లకు ఆయన ఫాలోయర్లే  ఘాటైన రీట్వీట్లు పెడుతూ ఉండటం గమనార్హం!

కామ్రేడ్ కథ మొత్తం చెప్పిన విజయ్ దేవరకొండ

తల్లిపేరుతో సంజయ్ చేస్తే.. తండ్రి పేరుతో లోకేష్ చేశాడు