అమిత్ షాతో భేటీ అయిన గోపీ చంద్!

బీజేపీ నాయ‌క‌త్వం తెలంగాణ మీద పూర్తి ఫోక‌స్ పెట్టిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వివిధ రంగ‌ల‌కు చెందిన‌ ప్రముఖులను క‌లుస్తు వ‌స్తున్నారు బీజేపీ పెద్ద‌లు. గ‌తంలో ఎన్టీఆర్ ను క‌లిసిన కేంద్ర హోం…

బీజేపీ నాయ‌క‌త్వం తెలంగాణ మీద పూర్తి ఫోక‌స్ పెట్టిన‌ట్లు క‌న‌ప‌డుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వివిధ రంగ‌ల‌కు చెందిన‌ ప్రముఖులను క‌లుస్తు వ‌స్తున్నారు బీజేపీ పెద్ద‌లు. గ‌తంలో ఎన్టీఆర్ ను క‌లిసిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ ప్ర‌ముఖ‌ బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు పుల్లెల గోపీ చంద్ తో భేటీ అయ్యారు.

తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం సంద‌ర్భంగా హైద‌రాబాద్ కు వ‌చ్చిన అమిత్ షా పుల్లెల గోపీ చంద్ తో ప్ర‌తేక్య భేటీ అయ్యారు. భేటీ అనంత‌రం గోపీ చంద్ మీడియాతో మాట్లాడుతూ రాజ‌కీయాల గురించి మాట్లాడ‌లేద‌ని కేవలం క్రీడా రంగం అభివృధి కోసం చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. 

ఈ మ‌ధ్య కాలంలో హైదారాబాద్ కు బీజేపీ పెద్ద‌లు ఎవ‌రూ వ‌చ్చిన తెలుగు రాష్ట్రాల్లోని ప్ర‌ముఖుల‌ను క‌ల‌వ‌డం అనవాయితీగా ఉన్న‌ట్లు క‌న‌ప‌డుతోంది. పైకి రాజ‌కీయ భేటి అని చెప్ప‌క పోయిన‌ బీజేపీ పెద్ద‌లు ఎవ‌రూ అవ‌స‌రం లేనిది ఎవ‌రిని క‌ల‌వ‌రు అనేది నిజం.

ఇక‌పై తెలంగాణ సార్వ‌త్రిక ఎన్నిక‌ల వ‌ర‌కు దాదాపు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను క‌లవ‌డం బీజేపీ నేత‌లు కామ‌న్ ఆజెండా అవ‌చ్చు. క‌నీసం కాస్తో కూస్తో వారి వ‌ల్ల ఓట్లు వ‌స్తాయి అంటే వారిని ఎన్నిక‌ల్లో ప్ర‌చారనికి వాడుకొవ‌చ్చు.