గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై హాట్ కామెంట్స్ చేశారు. సరైన టైమ్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎవరికోసమో, ఎవరో అడిగారనో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకోరన్నారు.
ఎన్టీఆర్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత టీడీపీ-బీజేపీ కలిసి పోటీ చేస్తాయన్నారు. చంద్రబాబు కొత్త పార్టీ పెట్టుకుని తన దత్త పుత్తుడు పవన్ తో కలిసి పోటీ చేస్తారని వ్యాఖ్యానించారు.
కుప్పాంలో ఎవరూ కార్యకర్తలు లేక ఇతర జిల్లాల నుండి కార్యకర్తలను పిలిపించుకుని నానా అల్లరి చేస్తున్నడని మండిపడ్డారు. ఏడుసార్లు గెలిచిన నియోజకవర్గంలో అభివృద్ధి చేయకుండా గాలికి వదిలేశారన్నారు. జాతీయ అధ్యక్షుడైనా చంద్రబాబు ఇప్పుడు కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవడం కోసం పోరాడాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, కుప్పంలో టీడీపీ కనుమరుగవుతందన్నారు.
సీఎం జగన్ దెబ్బకు టీడీపీ, జనసేన కకావికలం కాక తప్పదన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ పార్టీ ముసేస్తారని కొడాలి నాని తెలిపారు.