ప్రచారం వదిలేసిన దర్శకుడు

పెద్ద సినిమాలకు, భారీగా బజ్ వున్న సినిమాలకు దర్శకుడు ప్రఛారాన్ని వదిలేసినా ఫరవాలేదు. సినిమా సక్సెస్ తరువాత మాట్లాడతాను అంటే నడుస్తుంది. త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ లాంటి వాళ్లకు అది చెల్లుతుంది. కానీ మీడియం…

పెద్ద సినిమాలకు, భారీగా బజ్ వున్న సినిమాలకు దర్శకుడు ప్రఛారాన్ని వదిలేసినా ఫరవాలేదు. సినిమా సక్సెస్ తరువాత మాట్లాడతాను అంటే నడుస్తుంది. త్రివిక్రమ్, క్రిష్, సుకుమార్ లాంటి వాళ్లకు అది చెల్లుతుంది. కానీ మీడియం సినిమా, తనకు రెండో సినిమాకే దర్శకుడు మీడియా ముందుకు రాకుండా, సినిమాకు క్రేజ్ పాయింట్ తనే అయి వుండి కూడా ప్రచారాన్ని పట్టించుకోకుండా వుండడం అంటే ఆలోచించాల్సిందే.

మిస్టర్ మజ్ఞు సినిమాకు క్రేజ్ ఏమన్నా వుందీ అంటే అది దర్శకుడు వెంకీ అట్లూరి వల్లే. ఆయన ఫస్ట్ సినిమా తొలిప్రేమ మంచి హిట్ గా నిలిచింది. అందువల్లే కాస్త అయినా మిస్టర్ మజ్ఞుకి అట్రాక్షన్. హీరో అఖిల్ ప్లాపుల్లో వున్న సంగతి తెలిసిందే. అందుకే సినిమాకు మరీ అంత బజ్ రాలేదు.

ఇలాంటి నేపథ్యంలో దర్శకుడు వెంకీ అట్లూరి సినిమాకు బజ్ తీసుకురావడానికి తనవంతు సాయం చేయకుండా వెళ్లి చెన్నయ్ లో కాపీ చెక్, ఇతరత్రా వ్యవహారాలు లాస్ట్ మినిట్ వరకు పెట్టుకున్నారు. సినిమా విడుదల రెండురోజులు ముందు వరకు అక్కడే వుండిపోయారు. అక్కడి నుంచి ఎకాయెకి ఆలయాల సందర్శనకు వెళ్లిపోయారు.

ఆయన హైదరాబాద్ వచ్చేది ఇక సినిమా విడుదల ముందురోజు రాత్రే. సినిమా బాగుంటే వెంకీ అట్లూరి మీడియా ముందుకు విడుదల తర్వాత వచ్చే అవకాశం వుంది. పాపం అప్పటికీ కొడుకు కోసం నాగ్ నే రంగంలోకి దిగి ఇంటర్వూలు అనీ చేయాల్సి వచ్చింది.

జగన్, కేసీఆర్ కలయిక పరిణామం ఆంధ్రాలో ఎలా ఉండబోతోంది బిగ్ స్టోరీ 

సెక్సీ కామెంట్స్ః మగాళ్లు హద్దుల్లో ఉండాలిక!