చికిత్సకు రూ.25 కోట్లు.. ఖండించిన హీరోయిన్!

హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మయోసైటిస్ నుంచి కోలుకున్న ఈ బ్యూటీ, ఆ సైడ్ ఎఫెక్టుల నుంచి పూర్తిస్థాయిలో బయటపడి, మునుపటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకునేందుకు…

హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాల నుంచి గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మయోసైటిస్ నుంచి కోలుకున్న ఈ బ్యూటీ, ఆ సైడ్ ఎఫెక్టుల నుంచి పూర్తిస్థాయిలో బయటపడి, మునుపటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకునేందుకు సినిమాలకు విరామం ప్రకటించింది. ఇందులో భాగంగా అమెరికాలో ట్రీట్ మెంట్ కోసం ఆమె, ఓ స్టార్ హీరో నుంచి పాతిక కోట్ల రూపాయలు తీసుకుందనే ప్రచారం జరిగింది.

దాదాపు 2 రోజులుగా నడుస్తున్న ఈ ప్రచారాన్ని సమంత తిప్పికొట్టింది. తను ఏ హీరో దగ్గర్నుంచి డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేసిన ఈ హీరోయిన్, మయోసైటిస్ ట్రీట్ మెంట్ కు 25 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుందని రివర్స్ లో ప్రశ్నించింది.

“రూ.25 కోట్లు అంటే చాలా బ్యాడ్ డీల్. ఈ 25 కోట్లతో పోల్చుకుంటే, నా ట్రీట్ మెంట్ కోసం నేను ఖర్చు చేసింది చాలా తక్కువ..” అంటూ స్పందించింది సమంత. తన కెరీర్ లో కాస్తోకూస్తో బాగానే సంపాదించుకున్నానని, తన ఆరోగ్య బాగోగుల్ని తను చూసుకోగలనని పరోక్షంగా స్పందించింది.

దేశవ్యాప్తంగా వేలాది మంది మయోసైటిస్ తో బాధపడుతున్నారని, దయచేసి దాని ట్రీట్ మెంట్ కు సంబంధించి స్పందించే ముందు బాధ్యతాయుతంగా ఉండాలని కోరుతోంది సమంత. ప్రస్తుతం ఆమె తన స్నేహితులతో కలిసి ఫారిన్ టూర్ లో ఉంది.