మరో బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన కీర్తిసురేష్

సావిత్రి బయోపిక్ మహానటితో సూపర్ హిట్ అందుకుంది కీర్తిసురేష్. ఈమె మరో క్రేజీ బయోపిక్ లో నటించనుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి నటి జయలలిత జీవితం…

సావిత్రి బయోపిక్ మహానటితో సూపర్ హిట్ అందుకుంది కీర్తిసురేష్. ఈమె మరో క్రేజీ బయోపిక్ లో నటించనుందంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి నటి జయలలిత జీవితం ఆధారంగా రానున్న సినిమాలో కీర్తిసురేష్ నటిస్తుందనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు ఈ మేటర్ పై ఆమె స్పందించింది. 

జయలలిత బయోపిక్ లో తను నటించడం లేదని స్ఫష్టం చేసింది కీర్తిసురేష్. ఇప్పటివరకు ఆ సినిమాకు సంబంధించిన సభ్యులెవరూ తనను సంప్రదించలేదని, తనకు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు కూడా తెలియవని స్పష్టంచేసింది. 

జయలలిత బయోపిక్ లో మొన్నటివరకు త్రిషను అనుకున్నారు. మధ్యలో లక్ష్మీరాయ్ పేరు కూడా వినిపించింది. తాజాగా కీర్తిసురేష్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఈ పుకార్లకు కీర్తిసురేష్ చెక్ పెట్టడంతో.. ఆ బయోపిక్ మళ్లీ మొదటికొచ్చింది.

ప్రస్తుతం విజయ్ తో ఓ సినిమా చేస్తోంది కీర్తిసురేష్. విక్రమ్, విశాల్ సినిమాల్లో కూడా నటిస్తోంది. దీంతోపాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా, రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న మల్టీస్టారర్ లో కూడా కీర్తిసురేష్ ను తీసుకుంటారనే ప్రచారం సాగుతోంది.