మరో గ్రాఫిక్ దెబ్బ: కొనసాగుతున్న 2.0 కష్టాలు

ఈ సినిమాకు గ్రాఫిక్స్ చేస్తున్న అమెరికా సంస్థ ఒకటి ఆమధ్య దివాలా తీసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెంటనే అమెరికాకు చెందిన మరో సంస్థతో పాటు జపాన్ కు చెందిన ఇంకో సంస్థకు…

ఈ సినిమాకు గ్రాఫిక్స్ చేస్తున్న అమెరికా సంస్థ ఒకటి ఆమధ్య దివాలా తీసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వెంటనే అమెరికాకు చెందిన మరో సంస్థతో పాటు జపాన్ కు చెందిన ఇంకో సంస్థకు ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పనులు అప్పగించారు. తాజాగా అమెరికాకు చెందిన ఆ కంపెనీ కూడా దివాలా తీసినట్టు తెలుస్తోంది. దీంతో 2.0 గ్రాఫిక్ పనులు మరోసారి ఆగిపోయాయి. 

ప్రస్తుతానికి సినిమాకు సంబంధించి ఒక సెగ్మెంట్ గ్రాఫిక్స్ మాత్రమే జరుగుతున్నాయి. అది చాలా చిన్న పోర్షన్. మేజర్ పార్ట్ గ్రాఫిక్ పనులు మాత్రం నిలిచిపోయాయి. ఈసారి ఈ ప్రాజెక్టు ఎవరికి అప్పగించాలనే విషయంపై లైకా ప్రొడక్షన్స్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

మరోవైపు సినిమా టీజర్ రిలీజ్ పై కూడా సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే లీక్ అయిన విషయం తెలిసిందే. దీంతో కొత్తగా మరో టీజర్ కట్ చేయించారు. పాత టీజర్ లోని సన్నివేశాలకు మరికొన్ని కొత్త సీన్లు జతచేసి టీజర్ ను తయారుచేసినట్టు తెలుస్తోంది. ఐపీఎల్ ఫైనల్స్ సందర్భంగా ఈనెల 27న ఆ టీజర్ ను విడుదల చేస్తారట. 

ప్రస్తుతానికైతే గ్రాఫిక్ పనులు ఎవరికి అప్పగించాలనే అంశంపై లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలు సీరియస్ గా ఆలోచిస్తున్నారు. ఈ అంశం ఓ కొలిక్కి వచ్చిన తర్వాత టీజర్, ట్రయిలర్ విడుదల తేదీలను ప్రకటిస్తారు.