ఆ నిర్మాతకూ శిరీష్ సతాయింపు?

అల్లు వారి చిన్న హీరో శిరీష్ పేరు తరచు ఇండస్ట్రీ గుసగుసల్లో వినిపిస్తోంది. మొన్నటికి మొన్న 15లక్షల గురించి సీనియర్ ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ పై మాటలు విసిరాడని, చిరంజీవి గారి దగ్గర పంచాయతీ…

అల్లు వారి చిన్న హీరో శిరీష్ పేరు తరచు ఇండస్ట్రీ గుసగుసల్లో వినిపిస్తోంది. మొన్నటికి మొన్న 15లక్షల గురించి సీనియర్ ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ పై మాటలు విసిరాడని, చిరంజీవి గారి దగ్గర పంచాయతీ పెడతానని బెదిరించాడని వార్తలు బయటకు వచ్చాయి.

ఇప్పుడు మరో నిర్మాతను పది లక్షల కోసం సతాయిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్కక్షణం అనే సినిమాను ఆ మధ్య అల్లు శిరీష్ చేసాడు. ఈ సినిమా మీద చాలా అంచనాలు ఏర్పడ్డాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా విపలమయింది.

బయ్యర్లు చాలా వరకు కుదేలయ్యారు. నిర్మాత కూడా కొంత నష్టపోయారు. కానీ అక్కడితో కథ అయిపోలేదు. అల్లు శిరీష్ కు కొటి రూపాయలు రెమ్యూనరేషన్ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. కానీ పది లక్షలు బకాయి వుండిపోయినట్లు వినికిడి.

ఇప్పుడు ఈ పది లక్షలు తనకు ఎలాగైనా ఇవ్వాల్సిందే అని అల్లు శిరీష్ పట్టుపడుతున్నట్లు  గుసగుసలు వినిపిస్తున్నాయి. శిరీష్ సినిమా వల్ల పోయింది బయ్యర్లు కానీ, నిర్మాత కాదు అని, అందువల్ల బాకీ ఇవ్వాల్సిందే అన్నది హీరో తరపు జనాల వాదనగా వుంది.

సినిమా పోయిన తరువాత ఇంకా రెమ్యూనిరేషన్ బకాయి కోసం సతాయించడం ఏమిటి? బయ్యర్లే కాదు, నిర్మాత కూడా భారీగా నష్టపోయాడని ఇండస్ట్రీ వర్గాల పాయింట్ గా వినిపిస్తోంది.

ఏమైనా తరచు ఇలా నిర్మాతల పట్ల ఒక హీరో ఇలా ప్రవర్తిస్తున్నారన్నది బలంగా బయటకు వెళ్తే, కెరీర్ కు మైనస్ గా మారే ప్రమాదం వుంది.

నిర్మాతనే బాకీ

ఇదిలా వుంటే నిర్మాత చక్రినే చాలా మందికి బకాయి పడ్డాడని, సినిమావిడుదలకు ముందు శిరీష్ పూనుకుని మధ్యలో వుండి చాలా పనులు జరిగేలా చూసాడని, ఇప్పుడు వాళ్లంతా బిల్లులు రాలేదని శిరీష్ ను అడుగుతున్నారని తెలుస్తోంది. ఈ మేరకు శిరీష్ సన్నిహిత వర్గాలు వివరణ ఇచ్చాయి. శిరీష్ కు బకాయి పెట్టింది పదిలక్షలు కాదు ముఫై లక్షలని, అలాగే మేకప్ వాళ్లకి, హోర్డింగ్ వాళ్లకి,  కూడా నిర్మాత చెల్లింపులు చేయలేదని తెలిపారు. తన బాకీ కాకున్నా, మిగిలిన వారి బాకీలు అన్నా తీర్చమని శిరీష్ అడిగాడని, సినిమా వల్ల బయ్యర్లు నష్టపోయారు తప్ప, నిర్మాత కాదని వివరించారు.