గాయత్రి సెన్సార్ పూర్తి

సీనియర్ హీరో మోహన్ బాబు నటించిన గాయత్రి సినిమా సెన్సారు కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ లభించింది. 9,10 తేదీల్లో మూడు సినిమాలు విడుదలకు ప్లాన్ చేసుకుని వుండగా, ఫస్ట్ సెన్సారు కూడా…

సీనియర్ హీరో మోహన్ బాబు నటించిన గాయత్రి సినిమా సెన్సారు కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యు/ఎ సర్టిఫికెట్ లభించింది. 9,10 తేదీల్లో మూడు సినిమాలు విడుదలకు ప్లాన్ చేసుకుని వుండగా, ఫస్ట్ సెన్సారు కూడా పూర్తి చేసుకున్న సినిమా గాయత్రినే. సాయి ధరమ్ ఇంటిలిజెంట్, వరుణ్ తేజ తొలిప్రేమ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

మోహన్ బాబు రెండు పాత్రలు, విష్ణు యంగ్ మోహన్ బాబు క్యారెక్టర్ ధరించిన ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా కనిపిస్తుంది. సినిమా సబ్జెక్ట్ రివీల్ కాకుండా, క్యూరియాసిటీ పెంచేవిధంగా మాత్రమే ట్రయిలర్ కట్ చేసి వదిలారు. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో కథ వుంటుందని తెలుస్తోంది.

డైమండ్ రత్నం మాటలు అందించిన ఈ సినిమాకు మదన్ దర్ళకుడు. మోహన్ బాబు హీరోగా తెరపై కనిపించి చాలా కాలం అయింది. అలాగే విలన్ గా కూడా. ఈ సినిమాలో ఆయన ఆ రెండు పాత్రల్లోనూ కనిపించబోతున్నారు.